Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Devotional స్వామిని దర్శించుకున్న పి. సబితా ఇంద్రారెడ్డి….

స్వామిని దర్శించుకున్న పి. సబితా ఇంద్రారెడ్డి….

by Prakash
P. Sabitha Indra Reddy visited Swami

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు పి. సబితా ఇంద్రారెడ్డి. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీ శ్రీనగర్ ఫ్యాబ్ సిటీలో ముక్కోటి(వైకుంఠ) ఏకాదశి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు యువ నాయకులు కార్తీక్ రెడ్డితో కలిసి పి. సబితా ఇంద్రారెడ్డి ఉత్తరద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ప్రత్యేక పూజల అనంతరం తీర్థప్రసాదములు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు సబితా ఇంద్రా రెడ్డి ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపతో మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: