వరంగల్, హన్మకొండ కలెక్టర్ కార్యాలయం లో మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, సితక్క, కొండా సురేఖ ప్రజా పాలన పై సమీక్ష సమావేశం. హాజరైన ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు,వరంగల్ సీపీ, ఎస్పీ లు. ప్రజాపాలన గ్రామ, వార్డు సభలను కట్టుదిట్టంగా నిర్వహించాలి. రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ. దరఖాస్తుదారునికి రూపాయి ఖర్చు కాకుండా చర్యలు. ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభల నిర్వహణ. మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలి. ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి దరఖాస్తుదారునికి 4 నుంచి 5 నిమిషాల సమయం కేటాయించాలి. దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు. ప్రజా పాలన కార్యక్రమంలో అధికారుల ది ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైంది. ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించిన రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
321
previous post





Total views : 149717