Tuesday, June 2, 2026
News Navigation
Tuesday, June 2, 2026
News Navigation

Breaking

Tuesday, June 2, 2026
Home Andhra PradeshGuntur అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన సుబ్రహ్మణ్యం..

అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన సుబ్రహ్మణ్యం..

by Rama
Anganwadi

గత 21 రోజుల నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. ఈరోజు ప్రతివారు ఆఫీసుల్లో ఇళ్లల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటుంటే, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు మాత్రం రోడ్లపై కూర్చొని భిక్షాటన చేస్తున్నారని, వారు ఆకలితో అలమటిస్తున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో బాపట్ల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు బాపట్ల తెలుగుదేశం పార్టీ నాయకుడు మాడా సుబ్రహ్మణ్యం దాతృత్వంతో అంగన్వాడీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారికి సంఘీభావం తెలిపి, వారికి భోజనాలు ఏర్పాటు చేశారు. నూతన సంవత్సర సందర్భంగా వారికి మంచి రుచికరమైన బిర్యాని తానే స్వయంగా వడ్డించి అంగన్వాడి బాధలను నేను చూస్తూ ఉన్నానని, ఇకనైనా ఈ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిచి మీ డిమాండ్లు నెరవేర్చాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని మాడా సుబ్రమణ్యం అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

019428
Total views : 90702

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.