అవ్వ తాతలకు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనసున్న ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించాలని మాజీ డిప్యూటీ సీఎం నరసన్నపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సోమవారం నరసన్నపేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో వైయస్సార్ పెన్షన్ కానుక.. ఇకపై నుండి రూ. 3000 వేల రూపాయలకి పెంపు.. ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అందరూ ఆదరించాలని.. మళ్లీ గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 99% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్ధిదారులకు పెంచిన 3000 రూపాయలు పెన్షన్ డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వస్తుంటారని.. వారి కల్లబొల్లి మాటలు ప్రజలెవరు నమ్మవద్దని హితువు పలికారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్లీ ఏర్పడుతుందని దానిని ఎవరు ఆపలేరని ఆయన పేర్కొన్నారు.
మనమందరం అతన్ని ఆదరించి… మళ్లీ గెలిపించుకోవాలి
271
previous post






Total views : 90539