Wednesday, August 26, 2026
News Navigation
Wednesday, August 26, 2026
News Navigation

Breaking

Wednesday, August 26, 2026
Home Andhra PradeshWest Godavari 5న రా కదలిరా భారీ బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు..

5న రా కదలిరా భారీ బహిరంగ సభలో పాల్గొననున్న చంద్రబాబు..

by Rama
kollu ravindara

ఈనెల 5న ఏలూరు జిల్లా చింతలపూడిలో జరిగే రా కదలిరా భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలతో ప్రోగ్రాం కోఆర్డినేటర్లు మాజీ మంత్రులు సమావేశమై కార్యచరణ రూపొందించడం జరిగిందని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రా కదిలిరా బహిరంగ సభలో లక్ష మందికి పైగా పార్టీ కార్యకర్తలు పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, జగన్ ప్రజలకు చేస్తున్న మోసాలను ఎండకట్టి, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: