కరీంనగర్ బీఆర్ఎస్ కదనభేరి సభలో కాంగ్రెస్ పై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ‘మేం ఇంటింటికీ మంచి నీరు సరఫరా చేశాం. రెప్పపాటు కూడా కరెంట్ తీయలేదు. మీరు ఇప్పుడు కాంగ్రెస్ కి ఓటేస్తే.. కరెంట్ ఇవ్వకపోయినా, రైతు బంధు లేకున్నా మళ్లీ మాకే ప్రజలు ఓటేశారు అంటారు. గ్యారంటీలకు ఎగనామం పెడతారు. ఈ టైమ్ లో వారికి మీరు కర్రు కాల్చి వాత పెట్టకపోతే అహంకారం పెరిగిపోతుంది’ అని ఈ విషయం తెలంగాణ ప్రజలు గ్రహించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి పై కరీంనగర్ సభలో కేసీఆర్ నిప్పులు చెరిగారు. హోదాకు తగిన తీరులో ఆయన మాటతీరు లేదంటూ విమర్శించారు. ‘ఆరు గ్యారంటీలు ఏవయ్యా, కరెంటేదీ? నీళ్లేవీ? అని అడిగితే పండబెట్టి తొక్కుతా, పేగులు మెడలో వేసుకుంటా.. చీరుతా చంపుతా అని మాట్లాడతాడు. ఒక సీఎం మాట్లాడాల్సిన భాషా ఇది..? నేనూ ఉద్యమం సమయంలో మాట్లాడాను… కానీ పదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఒక్కసారైనా నా నోటి నుంచి దురుసు మాట విన్నారా?’ అని ప్రశ్నించారు. ఇక ఇదే విషయంపై మా కరస్పాండెంట్ సత్యనారాయణ కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ కదనభేరి నుండి మరిన్ని వివరాలు అందిస్తారు…
కాంగ్రెస్ కు కర్ర కాల్చి వాత పెట్టాలి : మాజీ సీఎం కేసీఆర్
278
previous post




Total views : 79407