కాజీపేట మండలం వడ్డేపల్లి క్రాస్ రోడ్ వద్ద ఘటన. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి. కాజీపేట నుంచి హనుమకొండ వైపు బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు రెవెన్యూ కాలనీ నుండి వడ్డేపల్లి వైపు వెళుతున్న కారును ఢీకొని ఇద్దరు వ్యక్తులు కింద పడిపోగా ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి. మరో వ్యక్తి ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా మృతి చెందినట్లు సమాచారం. కాజీపేట కు చెందిన సయ్యద్ వహీద్ , అశ్రఫ్ లు గుర్తింపు.