తెలంగాణ(Telangana) టెన్త్ ఫలితాలు(10th Results) విడుదలయ్యాయి. హైదరాబాద్లో విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 5.05 లక్షల మంది హాజరు కాగా, ఉత్తీర్ణత 91.31 శాతంగా నమోదైంది. ఇక తాజాగా విడుదలైన ఫలితాల్లో బాలికలు సత్తాచాటారు. 93.23 శాతం మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణత 89.42 శాతం. 99.05 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్లో ఉంటే.. 65.10 శాతం ఉత్తీర్ణత సాధించిన వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది. కాగా పదవతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు కూడా అధికారులు ఖరారు చేశారు. జూన్ 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరుసగా జరిగిన చైన్ స్నాచింగ్ కేసులను పోలీసులు ఛేదించారు. కేసులకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో…
- బాలానగర్లో గంజాయి ముఠాపై తెలంగాణ ఈగల్ భారీ ఆపరేషన్.హైదరాబాద్ బాలానగర్లో గంజాయి ముఠాను పట్టుకునేందుకు వెళ్లిన తెలంగాణ ఈగల్ పోలీసులకు ఊహించని ప్రతిఘటన ఎదురైంది. నిందితులు పోలీసులపై కుక్కను వదలడంతో పాటు స్క్రూడ్రైవర్తో దాడికి పాల్పడ్డారు. అర్ధరాత్రి ప్రారంభమైన ఈ ఆపరేషన్లో నిందితుడు పక్క భవనాలపైకి దూకుతూ తప్పించుకునే ప్రయత్నం…
- మంచిర్యాల జిల్లాలో ముగిసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు.మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివాసీల సాంస్కృతిక ప్రదర్శనలు, భారీ ర్యాలీ నిర్వహించి తమ ఐక్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.