Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి విజయం

సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి విజయం

by Rama
సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి విజయం

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని ఊటుకూరు, గుండ్లూరు, హెచ్ చెర్లోపల్లి, హస్తవరం గ్రామాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అదే విధంగా దిగువ మందపల్లి, తాళ్లపాక, మన్నూరు, పోలి గ్రామాల్లో జరిగిన నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అన్నిచోట్ల కూటమి అభ్యర్థులు హవా కొనసాగించారు. నందలూరు మండలంలో 13 గ్రామాల్లో జరిగిన ఎన్నికలు, పుల్లంపేట మండలంలో 12 గ్రామాల్లో జరిగిన ఎన్నికలు, పెనగలూరు మండలంలో 15 గ్రామాల్లో కూడా ప్రశాంతంగా జరిగాయి. ఈ నాలుగు మండలాల ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. ఏ ఎన్నికల బూతులో కూడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొన్ని బూతుల్లో చెదురు, ముదురు సంఘటనలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ, కూటమి అభ్యర్థులు సమన్వయంతో వ్యవహరించి, రాజీ పడినట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరిగిన అన్నిచోట్ల కూడా తెలుగుదేశం, జనసేన అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • ఒడిశా పూరి రథయాత్రలో సీఎం చంద్రబాబు.
    ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.. ఒడిశాలోని పూరి జగన్నాథుని మహా రథయాత్రకు ఆయన హాజరుకావడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సంస్కృతి విలువలను కాపాడడంలో…
  • పవన్‌కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.
    ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్ పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని… తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి… గవర్నర్…
  • నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.
    సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
  • పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.
    పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…
  • విశాఖ సముద్రంలో ఫిషింగ్ బోటు బోల్తా.
    విశాఖపట్నంలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చడంతో పెను ప్రమాదం తప్పింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు బోల్తాపడగా… ఏడుగురు మత్స్యకారులు మృత్యువు అంచుల వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, బోటు, వల పూర్తిగా…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

040924
Total views : 212398

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: