Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్.

by CVR NEWS
ఏపీలో దూసుకెళ్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్

ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ బులెట్ ట్రైన్ వేగంగా దూసుకెళుతోందని బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా రెండేళ్లలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయన్నారు.ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్న మాధవ్.. సీఎం చంద్రబాబు ముందుచూపుతో పెట్టుబడులు వస్తున్నాయన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 35 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు. అసాధ్యం అనుకున్న విశాఖ రైల్వే జోన్ ను ప్రధాని నరేంద్ర మోడీ సాధ్యం చేశారన్నారు. రెండేళ్లలో ఏపీలో కూటమి ప్రభుత్వ అభివృద్ధిని జగన్ , షర్మిళ పాదయాత్ర చేసి చూసుకోవచ్చని అన్నారు. డీఎస్సీ పోస్టులపై అధికారులు వివరణ ఇచ్చిన తర్వాత జగన్ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. జగన్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారన్నారు. ఇప్పటికే బీజేపీకి ఒక ఎమ్మెల్సీ, రెండు రాజ్యసభ సీట్లు వచ్చాయన్న మాధవ్..రానున్న రోజుల్లో బిజెపికి రావలసిన నామినేటెడ్ పదవులపై కూటమిలో సర్దుబాటు చేసుకుంటామన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుంటే..జీర్ణించుకోలేక విపక్షాలు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

026220
Total views : 150059

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.