158
రాష్ట్రంలో ఖరీఫ్-2026 సీజన్కు సంబంధించి ఎరువుల లభ్యత, పంపిణీపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని, రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ఆయన స్పష్టం చేశారు.
యూరియా, డీఏపీలతో పాటు ఇతర కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా విక్రయిస్తే డీలర్లు, కంపెనీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎరువుల బుకింగ్ యాప్ ఇబ్బందులను సరిచేయాలని, ఓటీపీల ఆలస్యాన్ని నివారించాలని ఆదేశించారు. ఎంఆర్పీ ధరలకే ఎరువులు విక్రయించాలని, నల్లబజారుకు తరలకుండా ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.