161
హైదరాబాద్ నగరంలో ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగదు చోరీ ఘటన సంచలనం రేపింది .రీన్బజార్–సంతోష్నగర్ ప్రధాన రహదారిపై ఏటీఎంలకు నగదు తరలిస్తున్న క్యాష్ వాహన డ్రైవర్ రూ.17 లక్షల నగదుతో పరారైయ్యాడు . పక్కా ప్రణాళికతో నగదు అపహరించిన నిందితుడు ద్విచక్ర వాహనంపై అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు . సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు కొనసాగుతుండగా , కొన్ని ప్రత్యేక బృందాలు నిందితుడి కోసం వెతుకుతున్నాయి. నగదు రవాణా భద్రతపై అధికారులు సమీక్ష ప్రారంభించారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.