194
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కర్నాటక రాష్ట్ర ప్రతినిధులు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కర్నాటక రాష్ట్ర మైనర్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్ఎస్ బోసేరాజు, ఎమ్మెల్యే బసవరాజు, ఎమ్మెల్సీ బస్వన్న గౌడ్ కలిసి సీఎంను కలిసి కీలక ఆహ్వానాన్ని అందజేశారు. ఈ నెల 25న జరగనున్న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరారు.. తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ఏర్పాటు ద్వారా ప్రాజెక్టు భద్రత, నీటి నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడనున్నట్లు ప్రతినిధులు సీఎంకు వివరించారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రెండు తెలుగు రాష్ట్రాలు, కర్నాటక మధ్య జలవనరుల వినియోగం, సాగునీటి అభివృద్ధి, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై కూడా సమాలోచనలు జరిపారు.