కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని ఇంద్రనగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెబ్బెన మండలం లోని అన్నపూర్ణ హై స్కూల్ కు చెందిన స్కూల్ బస్ 30 మంది పిల్లలతో వెళ్తున్న క్రమంలో ఇంద్రనగర్ గ్రామంలో పది మంది పిల్లలను దింపి మరో 20 మంది పిల్లల్ని కొండపల్లి గ్రామంలో దింపాల్సి ఉండగా యూటర్న్ తీసుకుంటే లాంగ్ పడుతుందని డ్రైవర్ రాంగ్ రూట్ వెళ్లడంతో ఎదురుగా వస్తున్న లారీ, బస్సును ఢీ కొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థులకు గాయాలుకాగా వారిలో కొంతమందిని కాగజ్ నగర్ ఆస్పత్రికి కొందరిని, మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు, బస్సు నడుపుతున్న డ్రైవర్ రెండు కాళ్లకు తీవ్ర గాయం కావడంతో చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ రాంగ్ రూట్లో రావడమే కారణమని స్థానికులు చెబుతున్నారు.
358
previous post





Total views : 81000