దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ రైలు కు సంబంధించిన అధికారిక ‘ఫస్ట్ లుక్’ వీడియోను విడుదల చేసింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఏరోడైనమిక్ డిజైన్తో మెరిసిపోతున్న ఆ ట్రైన్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును జపాన్ సహకారంతో భారత్ నిర్మిస్తోంది. తాజాగా విడుదల చేసిన ఈ తాజా వీడియోలో బుల్లెట్ రైలు ఎక్స్టీరియర్ ఆరెంజ్, బ్లాక్, క్రీమ్ వైట్ కలర్స్తో ఉంది. వేగానికి అనుగుణంగా రూపొందించిన ట్రైన్ ముందు ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ బుల్లెట్ రైలు గంటకు గరిష్టంగా 320 కి.మీ వేగంతో ప్రయాణించనుంది. దీందతో ముంబై- అహ్మదాబాద్ నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటలకు తగ్గిపోనుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ట్రాక్ నిర్మాణం, అండర్ వాటర్ టన్నెల్స్, స్టేషన్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
దేశం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతూ.
22
previous post





Total views : 80691