Saturday, May 2, 2026
News Navigation
Saturday, May 2, 2026
News Navigation

Breaking

>
Saturday, May 2, 2026
Home Political టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ నోటీసులు

by Rama
Chandrababu

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎమ్మిగనూరు, బాపట్ల, మార్కాపురం సభల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాను కలిసి వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల సంఘం నేడు చంద్రబాబుకు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు ప్రసంగాలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.

చంద్రబాబు ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచార యాత్ర సాగిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 31న ఆయన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లా మార్కాపురం, బాపట్ల జిల్లా కేంద్రంలో ప్రజాగళం సభలకు హాజరయ్యారు.

ఇది చదవండి: హ‌సీన్ దిల్‌రుబ‌ సినిమా తరహాలో.. మరిదితో కాపురం చేసిన వదిన..


పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..
కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని హోంమంత్రి అనిత తెలిపారు. అనకాపల్లి జిల్లా …
మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. వీరవాసరం మండలం …
అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…
అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో రహదారి సమస్యలు ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం …

Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

009437
Total views : 62365

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.