కర్నూల్ (Karnool) కు రానున్న జగన్:
సీఎం జగన్ చేపట్టిన మేము సిద్ధం బస్సు యాత్ర (Memu siddham Bus Yatra) నేడు కర్నూలు (Kurnool) జిల్లా ఎమ్మిగనూరుకు చేరుకోనుంది. సాయంత్రం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు వేగంగా చేస్తున్నారు. దాదాపు 6 ఎకరాల్లో ఉన్న వివార్స్ కాలనీ గ్రౌండ్లో ఈ మేము సిద్ధం సభను ఏర్పాటు చేశారు. సభలో లక్ష 50 వేలకు పైగా ప్రజలు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్టా రేణుక దగ్గరుండి పరిశీలించారు.
మేము సిద్దం బస్సు యాత్ర నేడు కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనుంది. పెంచికలపాడు నుండి మూడో రోజు యాత్ర ప్రారంభమై, కోడుమూరు నుండి రోడ్ షో గా వస్తు ఉదయం 9:30కు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వేమూగోడు వద్ద ప్రవేశించనున్న బస్సు యాత్రకు నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుండి నేరుగా రాళ్లదొడ్డి గ్రామంలో ఏర్పాటు చేసిన లంచ్ బ్రేక్ చేయనున్నారు. అక్కడి నుంచి నాలుగు గంటలకు ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మిగనూరులోని వివర్స్ కాలనీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మేము సిద్దం సభలో సిఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారని ఎమ్మిగనూరు అభ్యర్థి బుట్ట రేణుక తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో విజయం సాధించి క్లీన్ స్వీప్ చెయ్యడం ఖాయం అని బుట్ట రేణుక ధీమా వ్యక్తం చేశారు.
ఇది చదవండి:
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి




Total views : 80306