Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం…

సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం…

by Prakash
Dwama PD Adapa Venkatalakshmi

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో డ్వామా పిడి అడపా వెంకటలక్ష్మి అధ్యక్షతన నిర్వహించి ఇప్పటివరకు ఆయా గ్రామాల్లో నిర్వహించిన ఉపాధి హామీ పథకం క్రింద పని దినాలు, చెల్లింపులకు సంబంధించి గ్రామాల వారీగా ఆడిట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడపా వెంకట లక్ష్మీ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో 2023 -24 కి సంబంధించి ఉపాధి హామీ పనులు నిర్వహించిన పని దినాలు చెల్లింపులు ప్రతి గ్రామ స్థాయిలో ప్రదర్శించి ఈ రోజు మండల స్థాయిలో వాటి ఆడిట్ నిర్వహిస్తూ ప్రజా వేదిక నిర్వహించామని తెలిపారు. నూతనంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం, ప్రతి మండలానికి 60 లక్షల సి సి రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు అందాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisements

You may also like

Our Visitor

026228
Total views : 150068

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.