Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Telangana కబ్జాదారులను అడ్డుకున్న క్రీడాకారులు

కబ్జాదారులను అడ్డుకున్న క్రీడాకారులు

by Satya
కబ్జాదారులను అడ్డుకున్న క్రీడాకారులు...

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడాకారుల కోసం ప్రభుత్వం 106 సర్వే నెంబర్ లో 7 ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది .2010 లో క్రీడాకారుల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేటాయించడం జరిగింది. క్రీడా ప్రాంగణం కోసం అని విధుల కేటాయింపు కోసం క్రీడాకారులు ప్రభుత్వాల చుట్టూ చెప్పులురిగేలా తిరుగుతూ స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు .దానిపై కన్నేసిన భూకబ్జాదారులు గత ప్రభుత్వ హయాంలో భూమి ఆక్రమణ కోసం ఫెన్సింగ్ చేయడంతో ఒలంపిక్ అసోసియేషన్ నాయకులు, క్రీడాకారులు, ప్రజాసంఘాలు ఉద్యమం చేయడంతో ఆనాడు క్రీడాస్థలమును భూ కబ్జాదారులు నుంచి కాపాడుకున్నారు.

తిరిగి మరల భూకబ్జాదారులు క్రీడా ప్రాంగణం కోసం కేటాయించిన స్థలముపై కన్నేసి భూ కబ్జాదారులు స్థలమును చదును చేయడాన్ని క్రీడాకారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి క్రీడా ప్రాంగణం కోసం నిధులు కేటాయించి ప్రాంగణాన్ని పూర్తి చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు. క్రీడాస్థలమును కబ్జా చేయడానికి రాజకీయ నాయకుల అండదండలతో ఎంత పెద్ద వారు వచ్చినా అడ్డగిస్తామని క్రీడాస్థలం కాపాడుకోవడం కోసం ఎన్ని ఉద్యమాలకైనా సిద్ధపడతామని హెచ్చరిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి క్రీడాకారుల కోసం కేటాయించిన స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని క్రీడా ప్రాంగణంను కాపాడాలనికబ్జాదారులను అడ్డుకున్న క్రీడాకారులు వారు డిమాండ్ చేస్తున్నారు .

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • హైడ్రాపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి.
    తెలంగాణ రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్‌ను ధిక్కరిస్తూ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం…
  • ఒడిశా పూరి రథయాత్రలో సీఎం చంద్రబాబు.
    ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.. ఒడిశాలోని పూరి జగన్నాథుని మహా రథయాత్రకు ఆయన హాజరుకావడం రాజకీయ, ఆధ్యాత్మిక వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారతీయ సంస్కృతి విలువలను కాపాడడంలో…
  • పవన్‌కల్యాణ్‌ను పరామర్శించిన ఏపీ గవర్నర్ నజీర్.
    ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని గవర్నర్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్ పరామర్శించారు. ఇటీవల ముంబైలో పవన్ కుడి భుజానికి శస్త్ర చికిత్స చేసుకుని… తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. శస్త్ర చికిత్స అనంతరం పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి… గవర్నర్…
  • నీట్ పేపర్ లీక్పై పోరాడుతున్న సోనమ్ వాంగ్చుక్.
    సామాజిక కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష 19వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన వైద్య చర్యలన్నీ తీసుకోవాలని ప్రభుత్వానికి…
  • పాకిస్తాన్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.
    పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బన్ను జిల్లాలో ఉన్న మిర్‌యాన్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ పరిసరాలు ఒక్కసారిగా దద్దరిల్లిపోయాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందగా..డజన్ల సంఖ్యలో భద్రతా సిబ్బంది…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

040926
Total views : 212403

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: