పల్నాడు జిల్లా వినుకొండలో ఉచిత ఇసుకను ప్రారంభించారు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. వినుకొండ పట్టణం నందు మార్కాపురం రోడ్ లో ఉచిత ఇసుకను మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జునరావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. పారదర్శక విధానంతో నాణ్యమైన ఇసుక పంపిణి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. జీవో నెంబర్ 43 ని విడుదల చేయడం బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజల అభ్యున్నతికి, రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుందన్నారు. నాణ్యమైన ఇసుక పేద ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నదే ప్రభుత్వ విధానమన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక లోడింగ్, రవాణా చెల్లింపులు కేవలం డిజిటల్ విధానం ద్వారానే జరపాలని ప్రభుత్వం స్పష్టం చేసిందని ఎమ్మెల్యే ఆంజనేయులు తెలిపారు. గత ప్రభుత్వంలో టన్ను ఇసుక 475 రూపాయలు ఉండగా, ప్రస్తుతం 247 రూపాయలకే ప్రభుత్వం విక్రయిస్తుందన్నారు. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి 228 రూపాయల తేడా ఉందన్నారు ఉచిత ఇసుక విధానంతో భవన నిర్మాణరంగం దూసుకుపోయే అవకాశాలున్నాయని ఎమ్మెల్యే ఆంజనేయులు తెలిపారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- ప్రపంచ తొలి ట్రిలియనీర్ మస్క్.ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. ఆయనకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్ఎక్స్’అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ ఐపీఓగా లిస్ట్ అయిన తర్వాత, ప్రపంచంలోనే అత్యధిక సంపద కలిగిన మొదటి ‘ట్రిలియనీర్గా…
- వెనెజువెలా డ్రగ్స్ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్.మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్ గ్యాంగ్ ట్రెన్ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో ఆ ముఠా కీలక నేత హెక్టర్ రస్తెన్ఫోర్డ్ గురెరో ఫ్లోర్స్ హతమైనట్లు అమెరికా…
- కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన…
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 141451