డాక్టర్లపై జరుగుతున్న దాడులను ఖండించాలని మరియు డాక్టర్లకు ఆత్మ రక్షణ కల్పించాలని సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణకు, ఎమ్మార్వో సురేష్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు. డి.ఎస్.పి ఆదినారాయణ మాట్లాడుతూ మున్ముందు ఇలాంటి దాడులు పునరావ్రుతం కాకుండా రక్షణ కల్పిస్తాం. ప్రజలు ఇలాంటి సమస్యలు ఏమైనా వచ్చినాచో లీగల్ గా ప్రొసీడ్ అవ్వాలి తప్ప చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. దానికోసం ప్రజల్లో చైతన్యం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తాము.
Andhra Pradesh News
అమలాపురం రూరల్ భట్నవిల్లిలో పివి రావు, మాలమహానాడు ప్రతినిధులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. మీరు అధికారంలోకి వచ్చాక వైసిపి ప్రభుత్వం రద్దుచేసిన ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరించండి. అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుచేసి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి సహకరించండి. ఎస్సీల్లో అత్యధిక జనాభా కలిగిన మాకు అన్యాయం చేసేలా కొన్ని స్వార్థపర శక్తులు తెరపైకి తెస్తున్న ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపవద్దని కోరుతున్నాం.
నారా లోకేష్ మాట్లాడుతూ…
నా ఎస్సీలు, బిసిలు అంటున్న జగన్మోహన్రెడ్డి ఆయా వర్గాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. దళితులకు చెందాల్సిన 27సంక్షేమ పథకాలను రద్దు చేయడమేగాక , రూ.28,147 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారిమళ్లించిన దళిత ద్రోహి జగన్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు జరిగిన అన్యాయాలను ప్రశ్నించిన దళితులపై జగన్ సర్కారు తీవ్రమైన అణచివేత చర్యలకు పాల్పడుతోంది. టిడిపి అధికారంలోకి రాగానే జగన్ ప్రభుత్వం రద్దుచేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను పునరుద్దరిస్తాం. అంబేద్కర్ విదేశీ విద్య, బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్ పథకాలను పునరుద్దరిస్తాం.
Read Also…
Read Also…
విశాఖలో విజిలెన్స్ ఎస్పీ స్వరూప రాణి ఆధ్వర్యంలో జరిగిన ఆకస్మిక తనిఖీలు కలకలం రేపాయి. జగదాంబ జంక్షన్ లోని హెలపురి రెస్టారెంట్ పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కుళ్లిపోయిన మాంసం అమ్మకానికి పెట్టినట్టు అధికారులు గుర్తించారు. అనంతరం మధురవాడలోని జీ షాన్ రెస్టారెంట్ పై ఆకస్మిక తనిఖీలు చేశారు. బిర్యానిలో బొద్దింక వచ్చిందని ఫిర్యాదు రావడంతో ఆకస్మిక తనిఖీలు చేశామని తెలిపారు. ఈ దాడులలో కల్మి కబాబ్, బిర్యానీ శాంపిల్స్ ను సేకరించారు అధికారులు. ఫుడ్ సేఫ్టీ, విజిలెన్స్, శానిటేషన్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.
ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. స్కిల్డెవలప్మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలూ నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలన్న సీఐడీ అభ్యర్ధనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. స్కిల్ కేసు గురించి మాత్రమే చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ఇరు పక్షాలూ స్కిల్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయరాదని పేర్కొంది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి చంద్రబాబుకు అనుమతినిచ్చింది. మధ్యంతర బెయిల్ సమయంలో ఏపీ హైకోర్టు విధించిన షరతులను కొనసాగించాలన్న సీఐడీ అభ్యర్ధనకు కూడా న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది.
జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, విజయ సాయిరెడ్డి నేతృత్వంలో పని చేసే నిబద్ధత కలిగిన కార్యకర్తల సమావేశం ఇది. పార్టీలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగిన ఏ టైం లోనైన నా దగ్గరకు రావచ్చు, వారికి నేను అండగా ఉంటాను. వైస్సార్ కుటుంభంలో ఎలాంటి సమస్యలు ఎదురైన సహించేది లేదు. అందరికి ఒకే ఫెస్ ఉంటుంది, అందరూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నాము. వై నాట్ 175 అనే జగన్మోహన్ రెడ్డి ఆశయం కోసం అందరం కృషి చేయాలి.
Read Also…
Read Also…
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామ సమీపంలో 148 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మ్యూచువల్ గ ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి, జిల్లా కలెక్టర్ సృజన, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లు పాల్గొన్నారు. ఈ విద్యుత్ ఉపకేంద్రం ను సుమారు 12 ఎకరాల్లో నిర్మిస్తునట్టు తెలిపారు. ప్రస్తుతం జనాభా పెరుగుతున్న తరుణంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. వాటిని అదిగామించేదుకే రాష్ట్ర ప్రభుత్వం 220/132/33 కెవి గల ఈ విద్యుత్ ఉపకేంద్రంను ఏర్పటు చేస్తునమ్మని, ఈ ఉపకేంద్రం వల్ల ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు మండలాల ప్రజలకు లబ్ది జరుగుతుందని,ఈ ప్రాంతాల్లో లో ఓల్టేజి సమస్య తీరడమే కాకుండా,దీని ద్వారా వ్యవసాయ రంగంలో పగటిపూట తొమ్మిది గంటలు నిరంతరం నాణ్యమైన విద్యుత్తు పంపిణి జరుగుతుందని తెలిపారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట వైసీపీలో వర్గ విబేధాలు రోడెక్కినాయి. జ్యోతిరావు పూలే విగ్రహం వేదికగా గ్రూపు రాజకీయాలు బయటపడ్డాయి. విడివిడిగా జ్యోతిరావు పూలే విగ్రహంకి వైసీపీ శ్రేణులు నివాళులు అర్పించారు. ఒక పక్క ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి వర్గం, మరో ప్రక్క గజ్జల బ్రమ్మారెడ్డి వర్గం. జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం వేదికగా వైసీపీ అసంతృప్తి నేతలకు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. నా వల్ల పదవులు పొంది, నాపైనే ఎదురు తిరుగుతున్నారు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, నరసరావుపేట నుండి నేనె పోటీ చేస్తాను. ఇప్పుడు దాకా నా మంచితనం చుశారు, ఇక నుండి నేనేంటో చూపిస్తాను. ఆ ఇంటి నుండి ఈ ఇంటికి ఎంత దూరమో, ఈ ఇంటి నుండి ఆ ఇంటికి అంతే దూరం గుర్తు పెట్టుకోవాలి. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట వైసీపీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలు పొందుతాను.
పల్నాడు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్ లో అర్ధరాత్రి మహిళల నిర్బంధించారు. ఓ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అందులో ఒక వర్గం వైసీపీ నాయకులు కావడంతో మరో వర్గానికి చెందిన మహిళలను అర్ధరాత్రి అరెస్టు చేశారు. వైసిపి నాయకుడి వర్గం ఫిర్యాదుతో 18 ఏళ్ల యువతిని రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. సుమారు 40 ఏళ్ల వయసున్న ఇద్దరు మహిళలను నిర్బందించినట్లు సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. కనీసం మహిళా హోంగార్డు కూడా రక్షణగా లేకుండా రాత్రి అంతా మహిళలను నిర్బంధించడంపై బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also…
Read Also…
ఇటీవల ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట మార్కాపురం కు చెందిన నలుగురు వ్యక్తులు తమ భూములను ఆక్రమించి బెదిరిస్తున్నారని మీడియాతో మాట్లాడారు.ఈ క్రమం లో కొందరు నాపై ఆరోపణలు చేయడం విచారకరం. దీనిపై వివరణ ఇవ్వాలని భావించానని, అందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశానని, ఎమ్మెల్యే సోదరుడు కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దరిమడుగు గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి కి,అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో భూ తగాదాలు ఉన్నాయని, ఇందులో నన్ను లాగడం మంచిపద్దతి కాదన్నారు. గ్రామ చెరువు దశాబ్దాల క్రితం నాటి అంశం అని అన్నారు. రామడుగు రమేష్ కు, మా పార్టీ కే చెందిన మరో వ్యక్తితో ఉన్న విభేదాలు అని అన్నారు. మా పార్టీ అంతర్గత వ్యవహారం అని దానిని మేం సరిచేస్తున్నామని తెలిపారు. పోరెడ్డి నాగిరెడ్డి విషయం లో నాకు ఎలాంటి సంబంధం లేదని, నాగిరెడ్డి ద్వారా మోసపోయిన వారికి నేను మద్దతు ఇచ్చానని, చెప్పారు. పై విషయాల్లో నాకు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని నాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. దేవాలయ అభివృద్ధి నిధులు మీ పార్టీ వారే లెక్కలు చూస్తున్నారని, విచారణ చేసుకోవాలి అని సలహా ఇచ్చారు. భూ ఆక్రమాలలో ఎలాంటి పనైనా సిట్ ద్వారా పరిష్కారం చేసుకుందాం రా అని హెచ్చరించారు. అభివృద్ధి విషయంలో ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ టీడీపీ నాయకులకు . సవాల్ విసిరారు.
నవనందుల కోట నంద్యాల టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా నంద్యాల నవాబుగా ముద్దుగా పిలుచుకునే ఎన్ఎండి ఫరూక్ కె టిడిపి అధిష్టానం అధికారికంగా ఉత్తర్వులు వెల్లడించడంతో కనుచూపుమేరలో ఎన్నికలు ఉన్న సందర్భంలో నియోజకవర్గ నూతన ఇన్చార్జి నియామకంతో టికెట్ కూడా కచ్చితంగా ఖరారైనట్లేననీ ఆనందం వ్యక్తం చేస్తున్న నియోజకవర్గ టిడిపి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ వర్గాలు… అయితే మరి కొంత మంది మైనారిటీలో, ఫరూక్ వ్యతిరేక వర్గంలో మరో చర్చ మొదలైంది అని చెప్పొచ్చు. 2004 లో శిల్పా మోహన్ రెడ్డి తో, 2024 లో శిల్పా రవి తో ఓడిపోయి చరిత్ర సృష్టించనున్న మాజీ మంత్రి ఎన్.ఎం.డి.ఫరూక్ అంటూ మైనార్టీ వర్గాల్లో చర్చ.మేము తెలుగుదేశం అభిమానులము , మైనార్టీలమే కానీ మనసు చంపుకొని ఫరూక్ కు వేయము,ఇతర పార్టీకి ఓట్లు వేస్తామని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి వర్గంలో కలకలం తారాస్థాయికి చేరుకుంది ఇన్ని రోజులు పార్టీని అంటిపెట్టుకొని ఎన్నో రకమైన ఒడిదుడుకులు ఎదుర్కొని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమానికి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని ఇప్పుడు టికెట్ లేదంటే బాబు నిన్ను నమ్ముకున్న నాకు షూరిటీ లేకుండా పోయిందని భూమా బ్రహ్మానందరెడ్డి వర్గం వాపోతున్నారు… నంద్యాల పార్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి రెబల్ అభ్యర్థిగానైన ఒంటరిగా బరిలోకి దిగుతానని బ్రహ్మానంద రెడ్డి వర్గం కార్యకర్తల సమావేశంలో ఆయన వెలిబుచ్చారు భవిష్యత్తులో ఇంకా ఎన్ని మార్పులు చేర్పులు ఈ శిబిరాలలో జరుగుతాయో వేచి చూడాల్సి ఉంది.





Total views : 202665