అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ సందర్భంగా చెన్నూరులో ఆర్టీసీ బస్సు డిపో ఏర్పాటుపై ప్రశ్నించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరులో బస్సు డిపో ఏర్పాటు చేయాలని కోరారు. చెన్నూరుకు 3 రాష్ట్రాల బస్సులు వస్తాయని.. అందువలన త్వరగా బస్ డిపో పూర్తి చేయాలన్నారు. చెన్నూరు టూ హైదరాబాద్ ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచాలని మంత్రిని కోరారు. మంచిర్యాల టూ చెన్నూరు వయా బీమారం బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలి. అలాగే ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు మందమర్రి డిపోకు వచ్చి వెళ్లాలని మంత్రికి రిక్వెస్ట్ చేశారు ఎమ్మెల్యే వివేక్ .
15 ఏళ్లు దాటిన బస్సులన్నింటినీ తొలగిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అలాగే కొత్త రూట్లకు కూడా బస్సులు త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నూరులో బస్ డిపో ఏర్పాటుకు ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు మంత్రి పొన్నం . చెన్నూరు బస్ డిపో కోసం 4 కోట్లు మంజూరు చేశామన్నారు. మొదటి విడతగా కోటి 20 లక్షలు చెల్లించిందన్నారు. కాంపౌండ్ వాల్ , బేస్మెంట్ , గారెజ్ పనులు పూర్తయ్యాయి.. కానీ ఆర్టీసీకి సంబంధించిన భూమి హై కోర్టు స్టే ఉన్నందున పనులు నిలిచిపోయాయని తెలిపారు. హైకోర్టు స్టే ఎత్తివేసిన తర్వాత డిపో ఏర్పాటును వేగవంతం చేస్తామన్నారు మంత్ర పొన్నం.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చీరాలలో చెత్త నుంచి సంపద లక్ష్యం గాలిలోకేనా?ప్రకాశం జిల్లా చీరాల మున్సిపాలిటీలో “చెత్త నుంచి సంపద” సృష్టించాలనే ప్రభుత్వ లక్ష్యం నేడు ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పారిశుధ్యంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన చీరాల పట్టణం… ఇప్పుడు చెత్త నిర్వహణలోనే తీవ్ర వైఫల్యాలకు నిలయంగా మారిందని…
- హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ..స్టార్ గా, పర్సన్ గా విజయ్ దేవరకొండ జర్నీ ఎప్పుడూ ప్రత్యేకమే. ఒక్కొక్కటిగా ఆయన అనౌన్స్ చేస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హీరో కొత్త సినిమా ఆయన గత సినిమా సాధించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ మీద, ఆ…
- ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు..ప్రేమ ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. కానీ ఈ ప్రేమకథ వింటే మీరు ముక్కున వేలేసుకోవాల్సిందే..! సాధారణంగా పోలీసులు అంటే నేరస్తులకు భయం.. జైలర్ అంటే ఖైదీలకు వణుకు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. చట్టాన్ని కాపాడాల్సిన ఒక జైలు…
- విశాఖ కైలాసగిరిపై సరికొత్త అట్రాక్షన్..పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు VMRDA సుమారు రూ.2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన 65 అడుగుల భారీ…
- యాదాద్రిలో హాట్ టాపిక్ గా ప్రభుత్వ భూముల వివాదం..యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ భూముల వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఆలేరు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు అధికార పార్టీకే కాకుండా స్థానిక అధికార యంత్రాంగానికీ సవాలుగా మారాయి.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




Total views : 70892