అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజవర్గం నాథవరం మండలం చిన్న గోల్కొండ పేట మరియు ఆర్తి అగ్రహారం గ్రామాల్లోని ఎన్నికల సభలో నిర్వహించిన రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఉమ్మడి కూటమి అభ్యర్థులు విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నర్సీపట్నం ఎమ్మెల్యేగా చింతకాయల అయ్యన్నపాత్రుడి (Ayyannapathrudu)కి సైకిల్ గుర్తు పైన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు కమలంపై గుర్తుపైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ చేస్తూ సూపర్ సిక్స్ పథకాలు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని హారతులతోటి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణా తదితరులు పాల్గొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.ఏపీ రాజధాని అమరావతిలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వర్ణాంధ్ర–2047 థీమ్తో రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.సీడ్ యాక్సెస్ రోడ్డు…
- ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ.దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేశ చరిత్రలో తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ‘వందేమాతరం’ గేయాన్ని పూర్తిస్థాయిలో ఆలపించడం…
- టీవీ ఛానెళ్లలో యాడ్స్ పరిమితి రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం.టీవీ ఛానెళ్లలో ప్రసారం అయ్యే యాడ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెలివిజన్ ఛానెళ్లలో ప్రతి గంటకు గరిష్టంగా 12 నిమిషాల వాణిజ్య ప్రకటనల ప్రసారానికే పరిమితం చేస్తూ రెండు దశాబ్దాల క్రితం విధించిన నిబంధనను తొలగిస్తూ కేంద్ర…