ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లను వేగవంతంగా పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సెక్టోరియల్ అధికారులను ఆదేశించారు. సోమవారం బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ భవన్ లో ఈ.వి.ఎం ల కమిషనింగ్ పై జిల్లా ఎన్నికల అధికారి సెక్టోరియల్ అధికారులకు, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ సూచనల మేరకు సెక్టోరియల్ అధికారులు బి.ఎల్.ఓ ల ద్వారా ఇంటింటికి ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లను పంపిణీ చేయాలని, సంబంధిత సమాచారాన్ని బి.ఎల్.ఓ యాప్ ద్వారా పొందుపరిచే విధంగా ఆర్.ఓ చర్యలు తీసుకోవాలని తెలిపారు రిటర్నింగ్ అధికారికి అందజేయాలని తెలిపారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లన త్వరగా పంపిణీ చేసి నివేదిక పంపాలని తెలిపారు. ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ లో భాగంగా 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు తమ ఇంటి వద్దే ఓటు వేసేందుక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హోం ఓటింగ్ లో సెక్టోరియల్ అధికారులు మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్ ఏజెంట్ లు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకావాలని తెలిపారు. ఓటింగ్ అనంతరం వారికి వేలిపై సిరా చుక్క వేయడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ రోజు దివ్యాంగులకు సహాయకుడిగా వచ్చిన వారికి కుడి చేతి వేలిపై సిరా చుక్క వేయాలని అన్నారు
Tag:




Total views : 140733