నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ కు కార్యకర్తలతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. సభలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ సొంత పార్టీ ఎమ్మెల్యేలను పరోక్షంగా విమర్శించి, హెచ్చరికలు జారీ చేశారు. నందికొట్కూరులో పక్కా నియోజకవర్గం నాయకులు రాజకీయం చేశారని అదే రాజకీయం మీ నియోజకవర్గంలో నేను చేస్తే మీకు డిపాజిట్లు రావని సిద్ధార్థ రెడ్డి హెచ్చరించారు. గత నాలుగున్నర ఏళ్లలో అధికార పార్టీలో ఉన్న దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని, అటువంటి పరిస్థితులలో కూడా కార్యకర్తలను వీడలేదని అన్నారు. నియోజకవర్గంలో వైసిపి గెలుపుకు ఓట్లు అడిగింది మేము, కేసులు మోపుకుంది మేము, ఇబ్బందులు పడింది మేము అని మా నియోజకవర్గంలో పక్క నియోజకవర్గం వారి పెత్తనం ఏందని మా ఎమ్మెల్యే వాళ్ల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడడం ఏందనీ, ఎవడో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ రాజకీయం చేయడం ఏందని ప్రశ్నించారు. టిడిపి నాయకులను పక్కన పెట్టుకొని రాజకీయం చేయడం మగతనమని సొంత పార్టీ నేతలను ఘాఢంగా విమర్శించాడు. రాబోయే ఎన్నికలలో అభివృద్ధికి ఓటేయాలంటూ గౌరు వెంకటరెడ్డి, మాండ్ర, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, తోపాటు తాజా ఎమ్మెల్యే ప్రజలను అడుగుతారు, ప్రజలు వీరిని నమ్మే పరిస్థితి లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ టిడిపి పార్టీలోకి వెళ్ళనున్నట్లు పరోక్షంగా వెల్లడించారు. వైసీపీ మేనిఫెస్టో కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని కానీ టిడిపి మేనిఫెస్టోను నమ్మే పరిస్థితి లేదని అన్నారు. అనంతరం వైసిపి అభ్యర్థి డాక్టర్ సుధీర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలు సుమారు 5000 నుంచి 8000 వరకు పాల్గొన్నారని వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని తెలిపారు.
Film News
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో మార్కెట్ యార్డ్ లో ఏపీ శాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారా కార్యకర్తల పరిచయ కార్యక్రమం శక్రవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధీర్ దారా మాట్లాడుతూ నేను నందికొట్కూరు వాసిని మీ మనిషిని ఇక నుంచి మీ కష్ట సుఖాలు తెలుసు కోవడం కోసం నన్ను జగన్మోహన్ రెడ్డి నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపించడం జరిగింది. నేను కర్నూలు పరిసర ప్రాంతములలో డాక్టర్ గా సేవలు చేశాను అందులో మొదటగా నందికొట్కూరు కె అందించాను. నేను డాక్టర్ నుంచి రాజకీయాల్లోకి రావడానికి కారణం బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని అన్నారు. కార్యకర్తలు లేనిదే ఏ పార్టీ లేదు కార్యకర్తలు లేనిదే ఏ రాజకీయం లేదన్నారు. కార్యకర్తలు ఎవరెవరు నష్టం పోయారో వారినీ కాపాడకునే బాధ్యత నాదన్నారు. కార్యకర్తలను నాగుండెకు అత్తుకుని వారి కష్ట సుఖాలను పంచుకొని మీకు తోడుగా ఉంటానన్నారు. భారతదేశం లో ఎక్కడ లేనటువంటి విధంగా స్కూల్స్ కానీ ఆరోగ్య కేంద్రాలుకానీ అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు.
నంద్యాల వైసిపి లో విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే శిల్పా రవి పై వైసిపి జడ్పిటిసి గోకుల్ కృష్ణారెడ్డి తిరుగుబాటు చేస్తున్నారు. గత కొంత కాలంగా ఎమ్మెల్యే పనితీరు, మాటలను జడ్పిటిసి గోకుల్ కృష్ణారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యేకు చెందిన ఒక వీడియో వైరల్ అవుతుంది. వీడియోలోని డైలాగ్ ను గోకుల్ కృష్ణారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూన్నాడు. వీడియోలోని డైలాగ్ లకు వ్యతిరేకంగా రేపు గాంధీ చౌక్ లో ధర్నాకు గోకుల్ కృష్ణారెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు.
కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి…నిద్రపోతున్న మున్సిపాలిటీ అధికారులు
వీధికుక్కల దాడిలో చిన్నారి ప్రాణాలు విడిచాడు. 20 కుక్కలు ఒకేసారి దాడి చేయడంతో ఆ చిన్నారి అక్కడిక్కడే మృతిచెందాడు. కుక్క కాట్లకు గురైన ఓ చిన్నారి ఏడాది వయసులోనే కన్నుమూశాడు. ఇంటి వద్ద నిద్రపోతున్న చిన్నారిని కుక్కలు రోడ్డుపైకి లాక్కేలి మరీ చంపేశాయి. ఆ బాలుని మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అప్పటివరకూ తమతో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా విగతజీవిగా పడి ఉండడం చూసిన చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ హృదయ విదారకర సంఘటన మహబూబ్ నగర్ దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ కుటుంబంలో జరిగింది. సూర్యకుమార్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సమా ఎన్ క్లూ కాలనీలో జీవితం సాగిస్తున్నాడు. పెద్దకుమారుడి పేరు నాగరాజు ఆ బాలుని వయస్సు ఏడాది. అయితే గురువారం అర్ధరాత్రి సూర్యకుమార్ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో నాగరాజును 20 కుక్కలు ఒకేసారి దాడి చేసి రోడ్డుపైకి ఈడ్చుకెళ్లాయి. ఈ విషయాన్ని ఇంట్లో నిద్రిస్తున్న సూర్యకుమార్ గానీ ఆ బాలుని తల్లిగానీ గమనించలేదు పడుకొని లేచి చూసిన సూర్య కుమార్ కు నాగరాజు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఇద్దరు కంగారు పడ్డారు. తన కొడుకు నాగరాజు కోసం చుట్టుపక్కన వెతికిన ఎక్కడ కనిపించలేదు చివరకు రోడ్డుపై వచ్చి చూసేసరికి కుక్కలు లాక్కెళ్ళి చంపేసాయని గుర్తించారు. గతంలో మున్సిపాలిటీ పరిధిలో అనేకసార్లు కుక్కలు చిన్నారులపై దాడి చేసిన మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోవడం లేదు.
గంగూరు శాఖ యూనియన్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. గంగూరు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న ప్రభావతికి భర్తతో విబేధాలున్నాయి. ఆమె స్వగ్రామం నూజి వీడు మండలం మర్రి బంధం గ్రామం, కాగా అదే గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్ లో ఉన్న బ్యాంకు ఖాతాను ప్రభావతి గంగూరు శాఖకు ట్రాన్స్ఫర్ చేయించింది. ఈ సందర్భంగా యోగేశ్వరరావు తన వద్ద ఉన్న పాత్రలు, బంగారం కోసం లాకరు అడిగాడు. ప్రభావతి లాకరులో బంగారం దాయటం కన్నా బ్యాంకు రుణం తీసుకోమని, నాకు టార్గెట్లు ఉన్నాయి అని ఆయనకు సూచించింది. దీంతో యోగేశ్వర రావు రూ.2 లక్షలు రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణాన్ని ఆయన గతేడాది నవంబరులో చెల్లించాడు. అనంతరం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు గురించి అడగ్గా ఆ నగలు తన వద్దనే ఉన్నాయని ప్రభావతి తెలిపింది. ఈ విషయమై గంగూరులోని తన ఇంటికి వచ్చి మాట్లాడమని కోరింది. యోగేశ్వరరావు ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభరణా విషయమై ప్రశ్నించగా తనంటే ఇష్టమని, పెళ్లి చేసుకోమని కోరింది. బంగారు ఆభరణాలతో వడ్డాణం చేయిస్తున్నానని చెప్పింది. ఒక్కసారిగా యోగేశ్వరరావు షాక్ తిన్నాడు. ఈ ఘటనపై యోగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని ప్రభావతి ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందని పేర్కొన్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Read Also…
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజవర్గం సీతానగరం మండలం పెద్ద కొండేపూడి గ్రామానికి చెందిన కర్రీ అభిరామ్ అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన షేక్ ఆశ అనే మహిళను వివాహం చేసుకోవడం జరిగింది. కొంతకాలం బాగానే జీవించిన నేపథ్యంలో వారికి ఒక బాబు పుట్టడం జరిగింది. ఇటీవల కాలంలో వారిరువురు మధ్య చిన్న చిన్న గొడవలు ఉండడం వలన పెద్దలు సరిచేయడం జరిగిన సందర్భాలు కొనసాగాయి. అభిరామ్ అనే వ్యక్తి ఆశ అనే మహిళకు శిరోముడనం చేసి నన్ను ఎవరూ ఏమీ చేయలేరంటూ బహిరంగంగానే విమర్శించడంపై స్థానికులు జరిగిన అన్యాయానికి బాధితురాలికి న్యాయం జరగాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం GVK ప్రైవేట్ school లో 1st క్లాస్ చదువుతున్న విద్యార్థులు ఆకతాయిగా డ్రైన్ క్లీనర్ పౌడర్ తీసుకొచ్చి తినడంతో ఐదుగురు విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. వెంటనే స్కూల్ సిబ్బంది దగ్గరలో ఉన్న రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకు వచ్చి చికిత్స చేయించగా ఇద్దరు పిల్లలకు అస్వస్థత ఎక్కువ ఉండడంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వీరి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం మీద తీవ్ర ఆగ్రహం చూపిస్తున్నారు.
టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కొందరు అనుమతులు తీస్కుని మరికొందరు అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపి వందల కోట్లు సంపాదిస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుమతి అనేదే లేకుండా అందరికీ ఇళ్ల స్థలాలను మట్టి ఫిల్లింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలను వైసీపీ నేతలు తమ జేబుల్లో వేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ మట్టి తవ్వకాలను అడ్డుకోవాల్సిన మైన్స్, రెవెన్యూ శాఖల అధికారులు నామ మాత్రపు దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు.
కాకినాడ జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత ఈ మట్టి తవ్వకాల వెనుక ఉండటంతో అధికారులేవ్వరు అక్రమ మట్టి తవ్వకాలవైపు కన్నెత్తి చూసే ప్రయత్నం చేయడం లేదంటే అధికారులపై ఎలాంటి వొత్తిడి ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ హయాంలో మాజీమంత్రి చినరాజప్ప అనుచరులతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు మట్టి తవ్వకాలు చేస్తే…వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. కేవలం చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు మాత్రమే తవ్వకాలు చెయ్యాలని అధికారులకు హుక్కుం జారీ చేయడంతో ఇతరులు ఎవ్వరు రామేశం మెట్టలో మట్టి తవ్వకాలు జరిపినా అధికారులతో దాడులు జరిపించి భారీ మొత్తంలో జరిమానా విధించడంతో ద్వారంపూడి అనుచరులు కానీ వారు ఎవ్వరూ రామేశంమెట్టలో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న మెట్టలొ మట్టి తవ్వకాలు చేసేందుకు ద్వారంపూడి అనుచరులు ప్రయత్నించగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అడ్డుకున్నారు. నా పరిధిలో మట్టి తవ్వకాలు నా ఇష్టం ఇక్కడ తవ్వకాలు జరిపితే మర్యాదగా ఉండదని తెగేసి చెప్పడంతో ద్వారంపూడి చంటిబాబుపై కక్ష పెంచుకున్నారు. ఇందులో భాగంగానే జగ్గంపేటలో చంటిబాబును పక్కన పెట్టి నరసింహం కు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్ పదవి కట్టబెట్టారని ప్రచారం జరుగుతోంది.
అయితే ఇటీవల రామేశంమెట్టలో మట్టి తవ్వకాలను పెద్దాపురంకు చెందిన కొందరు అడ్డుకున్నారు. మైనింగ్,రెవెన్యూ అధికారులతో దాడులు చేయించి 13 టిప్పర్లు, 2ఎక్స్కవేటర్లు సీజ్ చేయించారు. విషయం తెలుసుకున్న ద్వారంపూడి సీజ్ చేశారు కదా ఫైన్ కట్టించుకుని వదిలేయండి అంటూ రుసరుసలాడుతూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎక్కడ సీజ్ చేసిన వాహనాలకు అక్కడే ఫైన్ వేసి వదిలేశారు. నాలుగున్నర ఏళ్లలో ఎప్పుడు లేనిది పెద్దాపురం వైసీపీ నేతలు మట్టి తవ్వకాలు అడ్డుకోవడంతో ఖంగు తిన్న ద్వారంపూడి ఎలాగైనా మట్టి తవ్వకాలు తానే చెయ్యాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈసారి అనుమతులు తీస్కుని తవ్వకాలు చేస్తే ఎలా అడ్డుకుంటారో చూస్తానని తన అనుచరుల వద్ద ద్వారంపూడి అనట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే మట్టి తవ్వకాలు అడ్డుకోవాల్సిన విపక్ష నేతలు మాత్రం రామేశం మెట్టకు వెళ్లకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే అంశం…
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఘన విజయం సాధించింది. అన్ని రకాల ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మహేశ్ సరసన శ్రుతిహాసన్ నటించింది. అయితే, ఈ చిత్రం ఇప్పడు వివాదంలో కూరుకుపోయింది. తాను రచించిన ‘చచ్చేంత ప్రేమ’ అనే నవల నుంచి ఈ సినిమా కథను మక్కీకి మక్కీ దించేశారని రచయిత శరత్ చంద్ర కోర్టుకెక్కారు. సుప్రీంకోర్టు సైతం కొరటాల శివ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలను జారీ చేసింది. ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు మహేశ్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం మహేశ్ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది. రచయిత శరత్ చంద్ర మహేశ్ బాబు, మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ పై కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలోనే తాను మహేశ్ బాబుకు నోటీసులు పంపానని… అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని శరత్ చంద్ర చెప్పారు. మహేశ్ పై సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.
కృత్రిమ మేధస్సు (AI) టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ, AI ప్రాంప్ట్ జనరేటర్లు మరింత శక్తివంతంగా మరియు సున్నితంగా మారుతున్నాయి. ఈ సాధనాలు వినియోగదారులు టెక్స్ట్, చిత్రాలు, వీడియోలు మరియు ఆడియో వంటి విభిన్న రకాల కంటెంట్ను సృష్టించడానికి AI మోడల్లను ఉపయోగించడానికి సహాయపడతాయి.
2024లో అత్యుత్తమ AI ప్రాంప్ట్ జనరేటర్లలో కొన్ని:
- Bard: Google AI నుండి వచ్చిన ఈ జనరేటర్ టెక్స్ట్ను ఉత్పత్తి చేయడానికి, భాషలను అనువదించడానికి, విభిన్న రకాల సృజనాత్మక కంటెంట్ను వ్రాయడానికి మరియు మీ ప్రశ్నలకు సమాచారంగా సమాధానం ఇవ్వడానికి శిక్షణ పొందిన భారీ భాషా నమూనా (LLM) ను ఉపయోగిస్తుంది.
- ChatGPT: OpenAI నుండి వచ్చిన ఈ జనరేటర్ టెక్స్ట్ మరియు కోడ్ యొక్క భారీ డేటాసెట్పై శిక్షణ పొందిన LLM. ఇది టెక్స్ట్ను ఉత్పత్తి చేయడానికి, భాషలను అనువదించడానికి, విభిన్న రకాల సృజనాత్మక కంటెంట్ను వ్రాయడానికి మరియు మీ ప్రశ్నలకు సమాచారంగా సమాధానం ఇవ్వడానికి ఉపయోగించవచ్చు.
- DALL-E 2: OpenAI నుండి వచ్చిన ఈ జనరేటర్ టెక్స్ట్ వివరణల నుండి చిత్రాలను సృష్టించడానికి శిక్షణ పొందిన AI మోడల్. ఇది చాలా వాస్తవిక మరియు సృజనాత్మక చిత్రాలను రూపొందించగలదు.
- Midjourney: Midjourney టెక్స్ట్ వివరణల నుండి చిత్రాలను సృష్టించడానికి శిక్షణ పొందిన మరొక AI మోడల్. ఇది DALL-E 2 కి ప్రత్యర్థిగా పరిగణించబడుతుంది మరియు చాలా వాస్తవిక మరియు కళాత్మక చిత్రాలను రూపొందించగలదు.
- Nightcafe Creator: Nightcafe Creator టెక్స్ట్ వివరణల నుండి చిత్రాలను సృష్టించడానికి శిక్షణ పొందిన మరొక AI మోడల్. ఇది వినియోగదారులకు చిత్రాలను రూపొందించడానికి మరింత నియంత్రణను అందిస్తుంది మరియు విభిన్న శైలులలో చిత్రాలను సృష్టించడానికి ఉపయోగించవచ్చు.
AI ప్రాంప్ట్ జనరేటర్ను ఎంచుకునేటప్పుడు, మీ అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. మీరు టెక్స్ట్ను ఉత్పత్తి చేయాలనుకుంటే, Bard లేదా ChatGPT ను , మీరు చిత్రాలను సృష్టించాలనుకుంటే, DALL-E 2, Midjourney లేదా Nightcafe Creator ను ఉపయోగించవచ్చు.





Total views : 149904