ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్లతో పోరాడుతుంది. ఉసిరికాయ జలుబు మరియు దగ్గు యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ పొడిని తేనెతో కలిపి తీసుకోవడం ద్వారా ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. ఉసిరికాయలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఉసిరికాయ పొడిని నీటితో కలిపి తీసుకోవడం ద్వారా ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. ఉసిరికాయలోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఉసిరికాయలు చర్మాన్ని ఆరోగ్యంగా మరియు చర్మంపై మచ్చలు నివారించడంలో సహాయ పడతాయి. ఉసిరికాయలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని సూర్యరశ్మి నుండి రక్షించడంలో మరియు మొటిమలు, మచ్చలు మరియు ఇతర చర్మ సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. ఉసిరికాయలు మన కేశాలను ఆరోగ్యవంతంగా బలంగా ఉండటంలో సహకరిస్తాయి. అంతేకాదు తలలో చుండ్రును నివారించడంలో సహాయపడతాయి. ఉసిరికాయలోని యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
Health Care
కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఇక ఉదయం పూట పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించక పోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. కీళ్ల నొప్పుల నుండి, ఒంటి నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో సూర్యరశ్మి శరీరానికి కావలసినంత అందక పోవడం వల్ల విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. విటమిన్-డి లోపాన్ని తగ్గించుకోవడానికి విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో మంచిది. సల్ఫర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా, క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకున్నా కాస్త కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు బాధిస్తున్న వారు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటే మంచిదని, సమతుల ఆహారంతో కీళ్లనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. నారింజ, క్యాబేజీ, బచ్చలికూర, టమోటాలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి నొప్పుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది.
నువ్వులు శరీరానికి ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు B, E, కాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలను అందిస్తాయి. నువ్వులు, బెల్లంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నువ్వులు తినేటప్పుడు సలాడ్లలో కూడా తీసుకుంటారు. నెయ్యిలో వేయించిన నువ్వులను ఉదయం ఖాళీ కడుపుతో నమలొచ్చు. ఆయుర్వేద వైద్యం ప్రకారం రోజూ ఒక టీస్పూన్ నువ్వులు తీసుకోవాలి. వీటిని డైట్లో చేర్చుకోవడం వల్ల గుండె సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావు. పైల్స్, మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే ఇవి మంచి ప్రభావం చూపుతాయి. నువ్వులు తినడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండొచ్చు ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి. రక్తంలో షుగరును అదుపులో ఉంచుతాయి. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. కీళ్లనొప్పులను తగ్గించడంతో పాటు థైరాయిడ్ ను నివారిస్తాయి. రక్తపోటు వచ్చే అవకాశాలను కూడా తగ్గిస్తాయి.
పాలకూరలో మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు లభిస్తాయి. పాలకూరలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. పాలకూరను జ్యూస్ రూపంలో రోజు ఉదయాన్నే పరగడుపునే ఒక కప్పు మోతాదులో తాగితే అధిక బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే కొవ్వు కరుగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. పాలకూరలో మెదడు పనితీరుకు అవసరం అయ్యే పోషకాలు అధికంగా ఉంటాయి. అందుకే దీన్ని తింటే మెదడు చురుగ్గా మారుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. పిల్లలు చదువుల్లో రాణిస్తారు. పాలకూరలో ఐరన్ అధికంగా ఉంటుంది. కనుక దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే శరీరంలో రక్తహీనత సమస్య తగ్గుతుంది. బలహీనంగా ఉన్న పిల్లలు పాలకూర మంచి బలాన్ని అందిస్తుంది. పాలకూర రక్తాన్ని పలుచగా చేయడంలో సహాయ పడుతుంది. శరీరంలో రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో హార్ట్ ఎటాక్లు రాకుండా ఉంటాయి. జుట్టు, చర్మం ఆరోగ్యంగా కూడా పాలకూర చాలా బాగా ఉపయోగపడుతుంది. పాలకూరలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కనుక శరీరానికి శక్తి బాగా లభిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్ శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. పాలకూరను తీసుకోవడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. దీంతో వారు లైంగిక చర్యలో చురుగ్గా పాల్గొంటారు. పాలకూరను రోజూ నేరుగా వండుకుని తినవచ్చు. లేదా జ్యూస్ రూపంలో ఒక కప్పు మోతాదులో తాగవచ్చు. సూప్స్, సలాడ్స్ రూపంలోనూ తీసుకోవచ్చు.
ఈ గింజల్ని రోజు తీసుకోవడం వల్ల ఇందులో ఉండే విటమిన్స్ కంటి చూపును మెరుగుపరచడంతోపాటు బాడీ మెటపాలిజంని పెంచుతాయి. మొలకెత్తిన గింజల్ని రోజు తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ తో పాటు రక్త సరఫరా సక్రమంగా జరిగేలాగా చూస్తుంటాయి. అంతేకాకుండా శరీరంలో అన్ని భాగాలకు మెదడుకు సైతం రక్తం సరఫరా సక్రమంగా జరగడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు. బరువు తగ్గాలి అనుకున్నవారు ఉదయం అల్పాహారంలో వీటిని భాగం చేసుకోవడం ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనని కలిగిస్తుంది. దీంతో ఆహారాన్ని తక్కువగా తీసుకుంటారు. కానీ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు వీటితో అందుతాయి. మొలకల్ని తీసుకోవడం వల్ల ఇవి శరీరంలో క్యాన్సర్ కారకాలని పెరగనివ్వవు. అంతేకాకుండా క్యాన్సర్ కణాలని అడ్డుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. శరీరంలో రోగ నిరోధక శక్తిని సైతం పెంచడంలో ఇవి ముందుంటాయి. సాధారణంగా మొలకెత్తి గింజల్ని తీసుకోవడం వల్ల వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా మారుతాయి. ఇవి చర్మాన్ని, గోళ్ళని ఆరోగ్యంగా మారుస్తాయి. అంతేకాకుండా చర్మం మెరిసేలా చేయడంతో పాటు అందాన్ని మెరుగుపరుస్తాయి. వీటిని తీసుకుంటే జుట్టు ఊడే సమస్య అదుపులో ఉంటుంది. ఊడిపోయిన జుట్టు స్థానంలో కొత్తవి వచ్చి సక్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది.
ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర చాలా ముఖ్యం. అవును నిద్ర లేకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏకాగ్రత, శ్రద్ధ, నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అందుకే రాత్రిపూట కనీసం ఏడు గంటల పాటైనా నిద్రపోయేలా చూసుకోండి. మీరు సరిగ్గా నిద్ర లేకపోతే ఉదయం లేచిన వెంటనే చిరాకు కలుగుతుంది. ఆ రోజంతా మీరు చిరాకుగానే ఉంటారు. అలాగే ఆందోళన, నిరాశ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు మొదలైనవి వచ్చే అవకాశం కూడా ఉంది. నిద్రలేమి హృదయ సంబంధ వ్యాధులు, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదకరమైన రోగాలేమీ రాకూడదంటే మీరు కంటినిండా నిద్రపోవాలి. నిద్రలేమి వల్ల కూడా ఎన్నో చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇది కూడా మీ చర్మ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్రలేమి వల్ల మీ చర్మం పొడిబారడం, ముడతలు పడటం, తామర వంటి చర్మ సమస్యలొచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీరు రాత్రిపూట సరిగ్గా నిద్ర లేకపోతే మీ ఇమ్యూనిటీ పవర్ పై ప్రభావం పడుతుంది. తక్కువ గంటలు నిద్రపోవడం వల్ల మీ రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా మీకు ఎన్నో వ్యాధులు, అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది. దీనివల్ల మీరు తరచూ అనారోగ్య సమస్యల బారిన పడతారు. నిద్ర లేకపోవడం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శరీర సామర్థ్యం ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత, డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల మీ ఆకలి హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది ఆకలి, అనారోగ్యకరమైన ఆహారం కోసం మీలో కోరికలను పెంచుతుంది. దీంతో మీరు విపరీతంగా తిని బాగా బరువు పెరుగుతారు.
చాలామందికి కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి చెప్పలేనంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపం శుత్రువులను పెంచడమే కాదు. స్నేహితులను, కుంటుంబ సభ్యులను దూరం చేస్తుంది. కొపాన్ని కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కోపాన్ని నియంత్రించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ కొన్ని ఆహార పదార్థాలు తింటే వెంటనే కోపం కంట్రోల్ అవుతుంది. కోపం ఎక్కువగా ఉన్నవారు వారి డైట్లో పసుపు చేర్చుకుంటే మానసిక పరిస్థితి మెరుగుపడుతుందని తెలుస్తోంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కర్కుమిన్ మన శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ వంటి ‘ఫీల్-గుడ్’ హార్మోన్లను ప్రేరేపిస్తుంది. అరటిపండులో విటమిన్ ఏ, బి, సి, బి6, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మీ శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. డోపమైన్ వంటి హ్యాపీ హార్మోను యాక్టివ్ చేస్తాయి. ఇది ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను దూరం చేసి కోపాన్ని తగ్గిస్తుంది. డ్రై ఫ్రూట్స్ లో బాదం ప్రత్యేకతే వేరు ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎంత మేలు చేస్తాయని సంగతి తెలిసిందే ముఖ్యంగా ఇందులో విటమిన్ ఈ తో పాటు కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇవి కండరాలు నరాల కు ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా శరీరంలో కోపాన్ని సైతం తగ్గిస్తాయని భావోద్వేగాలని నియంత్రిస్తుందని తెలుస్తోంది. శరీరానికి జుట్టుకు ఎంతో మేలు చేసే అవిస గింజలు కోపాన్ని సైతం నియంత్రిస్తాయని తెలుస్తోంది. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆల్ఫా-లినోలెయిక్ యాసిడ్ను మెండుగా ఉంటాయి. అవిసె గింజలు కోపాన్ని కంట్రోల్ చేసే సూపర్ఫుడ్గా పనిచేస్తుంది.
పైల్స్ సమస్య అనేది అనేక కారణాల వల్ల వస్తుంటుంది. మాంసాహారం ఎక్కువగా తినడం, అధిక బరువు, గంటల తరబడి కూర్చుని ఉండడం, డయాబెటిస్, థైరాయిడ్ వంటి అనేక కారణాల వల్ల పైల్స్ వస్తుంటాయి. పైల్స్ను తగ్గించుకునేందుకు రోజూ తీసుకోవాల్సిన ఆహారాలు. రోజూ ఉదయాన్నే పరగడుపునే 3 లేదా 4 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకుని పెనంపై వేసి వేయించి వాటిని అలాగే తినండి. నేరుగా తినలేం అనుకుంటే తేనెతో కలిపి తీసుకోవచ్చు. దీని వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. మెటబాలిజం మెరుగు పడుతుంది. గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం నుంచి బయట పడతారు. మలబద్దకం తగ్గి పైల్స్ నుంచి విముక్తి పొందవచ్చు. బాదంపప్పులో ప్రోటీన్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. అందువల్ల బాదంపప్పును రోజూ తింటే పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. బాదంపప్పును రాత్రి పూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే వాటిని పొట్టు తీసి తినాలి. దీని వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోవడంతోపాటు మలబద్దకం తగ్గుతుంది. కిస్మిస్లలో జింక్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. రాత్రిపూట కొన్ని కిస్మిస్లను తినండి. దీంతో మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది. దీంతో పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు.
రాత్రంతా నానబెట్టిన వేరుశనగను ఉదయాన్నే ముందుగా తీసుకోవాలి. వేరుశనగలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతోపాటు ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాత్రంతా నానబెట్టిన వేరుశనగ తినడం వల్ల మన కండరాలు బలపడతాయి. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. నానబెట్టిన వేరుశనగ గింజలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కాబట్టి జీర్ణక్రియ బాగా జరగాలంటే నానబెట్టిన వేరుశనగ తినండి. మరో అద్భుతమైన ప్రయోజనం ఏమిటంటే, నానబెట్టిన వేరుశనగ గింజల వినియోగం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది. మన జ్ఞాపకశక్తి, కంటి చూపును మెరుగుపరచడానికి నానబెట్టిన వేరుశనగను తినాలి. గుండె ఆరోగ్యం కోసం మీరు నానబెట్టిన వేరుశనగ తినాలి. ఇది అనేక గుండె సమస్యలను నయం చేస్తుంది.
పిస్తాపప్పులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ B6 మరియు థయామిన్తో సహా వివిధ పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి.ఆయుర్వేదంలో, పిస్తాపప్పులు శరీరం, మనస్సుకు ,మెదడు పనితీరును మెరుగుపరచడానికి ,మొత్తం శరీర శక్తికి సహాయపడతాయి. గట్, కంటి , రక్తనాళాల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. డయాబెటిస్తో బాధపడుతున్న చాలా మంది ఆరోగ్యకరమైన అల్పాహారాలను తీసుకోవటానికి ఇష్టపడతారు. ఇవి కడుపును నిండుగా ఉంచటంతోపాటు, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. టీ తీసుకునే సమయంలో రుచికరమైన, పోషక విలువలు కలిగిన పిస్తాపప్పులను తీసుకోవచ్చు. పిస్తాపప్పులు కరకరలాడుతూ, వగరుగా , కొద్దిగా తీపిగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి సరైన చిరుతిండిగా నిపుణులు సూచిస్తున్నారు. పిస్తాపప్పును వంటకాలలో రుచి కోసం ఉపయోగించవచ్చు.





Total views : 140790