ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విషయంలో తెలంగాణ హైకోర్టు కన్నెర్ర చేయడంతో ప్రభుత్వం ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతోంది.అన్నదాతల ఆత్మహత్యలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై గత ఏడాది హైకోర్టులో విచారణ జరిగింది. పరిహారం ఇచ్చే అంశం పరిశీలనలో ఉందని నాడు ప్రభుత్వం పేర్కొంది. నాలుగు నెలల్లో చెల్లిస్తామని అప్పట్లో అధికారులు న్యాయస్థానానికి తెలిపారు. ఏడాది దాటినప్పటికీ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించలేదు. దీనిపై కొండల్ రెడ్డి అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జనగాం, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ను కోర్టు దిక్కరణ కింద ఎందుకు స్వీకరించకూడదో చెప్పాలని పేర్కొంది. దీంతో ఇప్పుడు అధికారుల్లో వణుకు మొదలైంది. ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వివరాల సేకరణ పనిలో పడ్డారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- వెనెజువెలా డ్రగ్స్ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్.మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉక్కుపాదం మోపింది. వెనెజువెలాకు చెందిన కరుడుగట్టిన డ్రగ్స్ గ్యాంగ్ ట్రెన్ డి ఆరాగ్వాపై చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో ఆ ముఠా కీలక నేత హెక్టర్ రస్తెన్ఫోర్డ్ గురెరో ఫ్లోర్స్ హతమైనట్లు అమెరికా…
- కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.కాకినాడ జిల్లాలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో తమ కుమార్తెను యువకుడు ఉరివేసి హత్య చేశాడని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళన…
- ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. చీమకుర్తి మండలం తొర్రగుడిపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బత్తుల సుబ్బారావుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలోని సింగరాయకొండ, ఉలవపాడు ప్రాంతాలకు చెందిన నాలుగు గిరిజన కుటుంబాలను పనుల నిమిత్తం గ్రామానికి రప్పించిన…
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
- అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్.అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 141335