పీరియడ్స్ టైమ్లో చాలా మంది మహిళలు కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, వాంతులు, కళ్లు తిరగడం, నీరసం, చికాకు, తిమ్మిర్లు లాంటి సమస్యలు కారణంగా ఇబ్బంది పడుతుంటారు. పీరియడ్స్ టైమ్లో పసుపు పాలు తాగితే అనేక లాభాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పసుపు పాలు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. దీన్ని గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారు. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. పసుపులో విటమిన్లు, మినరల్స్, మాంగనీస్, ఐరన్, ఫైబర్, విటమిన్ బి6, కాపర్, పొటాషియం ఉంటాయి. రోజూ పసుపును ఆహారంలోకి చేర్చుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన దానిలో పది శాతం ఐరన్ అందుతుంది. తగిన మోతాదులో ఇనుము లభించడం వల్ల హిమోగ్లోబిన్, కొత్త రక్తకణాలు ఉత్పత్తికి అవకాశం కలుగుతుంది. పసుపు రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పసుపు పాలు తాగితే శరీరంలో వాపు, మంట తగ్గుతుంది. ధమనులు దెబ్బతినకుండా రక్షిస్తుంది. పసుపులోని కర్కుమిన్ కొలెస్ట్రాల్ను 30%, ట్రైగ్లిజరైడ్లను 40% తగ్గిస్తుంది. రక్త ప్రసరణ స్థాయిని మెరుగుపరుస్తుంది. అథెరోస్క్లెరోసిస్ అని పిలిచే ధమనులు గట్టిపడకుండా చూసుకుంటుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ను కంట్రోల్లో ఉంచుతాయి. పసుపు పాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి టైప్ 2 డయాబెటిస్ ముప్పు కూడా తగ్గిస్తాయి. ప్రతిరోజూ తగినంత విటమిన్ డి తీసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఇది అండాశయాలలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచి హార్మోన్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. పసుపు పాలు తాగితే కడుపునొప్పి, నడుం నొప్పి, కాళ్లు లాగడం, వాంతులు, కళ్లు తిరగడం, నీరసం, చికాకు, తిమ్మిర్లు లాంటి సమస్యలు నుంచి బయటపడవచ్చు. పసుపు పాలు తాగితే నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా చేస్తాయి.
lethargy
కడుపులో నులిపురుగుల నివారణకు : జీలకర్రను తీసుకోవాలి. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.
గుండె నొప్పులు తగ్గుటకు : జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. బీపీ, షుగర్ను కంట్రోల్ చేస్తుంది.
ఎలర్జీకి తగ్గుటకూ : శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర – చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం.
గర్భాశయ బాధలు తగ్గుటకు : జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి 2 పూటలా తీసుకొంటే గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. దీన్ని అన్నంలో కాని, మజ్జిగలో కాని తీసుకోవాలి.
మూత్ర సంబంధ వ్యాధులకు : జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి.
నీరసము తగ్గుటకు : ఎప్పూడూ నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడుతున్నవారు జీలకర్రను గాని, ధనియాలు+ జీలకర్ర మిశ్రమం గాని తీసుకొంటే మంచిది.
పేగులు శుభ్రపరచుట : ధనియాలు, జీలకర్ర సమానపాళ్ళలో తీసుకొని వాటిని విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో తగినంగ సైంధవలవణం లేదా ఉప్పును కలిపి, అన్నంలో, టిఫిన్లు, మజ్జిగలో కలుపుకొని వాడుకుంటే పేగులు శుభ్రపడి రోగాలకుదూరంగా ఉంటారు.
పైత్యరోగాలకు : జీలకర్రను నిమ్మరసముతో కలిపి సూర్యోదయ సమయాన , సూర్యాస్తమ సమయమున రెండపూటలా తింటే తలతిప్పు , కడుపులోని వేడిని మొదలగు పైత్యరోగములు తగ్గును.
తేలుకుట్టుకు : జీలకర్ర , తేనె , ఉప్పు , నెయ్యి కలిపి నూరి తేలుకుట్టిన చొట కట్టు కట్టిన తేలు విషము హరించును.
నీళ్ళవిరోచనాలు తగ్గుటకు : అరతులము జీలకర్ర ఇనుమూ గరిటె లో మాడబెట్టి అందులులో 5-6 తులముల నీరు పోసి చల్లారిన తరువాత ప్రతి 4 గంటలకొకసారి తీసుకుంటే నీళ్ళవిరోచాను తగ్గుతాయి.
వాంతులు తగ్గుటకు : వేయించం జీలకర్ర తో సమముగా సైంధవలవణము కలిపి నూరి సీసాలో బద్రపరిచి రోజుకు కొంచము కొంచము గా రెండుపూటలా ఇచ్చిన వాంతులు తగ్గును.





Total views : 62322