మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్న ఆర్టీసీ రానున్న మేడారం, ఇతర జాతరలకు నడిపే ప్రత్యేక బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని తొలగించి ఛార్జీలు వసూలు చేస్తామని ప్రతిపాదించింది. రాష్ట్ర బడ్జెట్కు సంబంధించి ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థకు ఆదాయం పెరుగుతుందని ఈ ప్రతిపాదన తీసుకురాగా భట్టి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. మహిళలకు ఉచిత ప్రయాణం విధానాన్ని అమలుచేయాల్సిందేనని, మేడారం సహా ఏ జాతరకు మహిళా ప్రయాణికుల నుంచి టికెట్ ఛార్జీలను వసూలు చేయవద్దని, ఆ ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఈసారి మేడారం జాతరకు ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు ఆర్టీసీ 6,000 ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాద్ నుంచే రెండు వేల సిటీ బస్సులను పంపించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం.
Tag:
RTC officials
ఏపిఎస్ ఆర్టీసీకి ఆదాయానికి కేటుగాళ్లు భారీగా గండి కొడుతున్నారు. విశాఖలో కలాసీలను సొంత వాహనాల్లో సరుకు రవాణా చేస్తున్నారు. ఇంటర్సిటీ ట్రాన్స్ పోర్ట్ కోసం ప్రైవేటు వ్యక్తుల వాహనాల్లో సరుకును తరలిస్తున్నారు. ప్రైవేట్ వాహనాలపై యధేచ్చగా ఏపీఎస్ఆర్టీసీ బోర్డులు పెట్టుకుని సరుకును తరలిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో సరుకు రవాణా చేస్తున్నా ఆర్టీసీ అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తుండటం గమనార్హం. పబ్లిక్ గా ఇలా జరుగుతుంటే ఆర్టీసీ ఎప్పటికీ లాభాల్లోకి రాదని ఉద్యోగులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా విశాఖ ఆర్టీసీ అధికారులు పట్టించుకోక పోవడంతో ఉద్యోగులు మండిపడుతున్నారు.





Total views : 150182