నేడే ఉత్క్కంటకు తెర, నేడు ప్రజా తీర్పు తెలనున్న అభ్యర్థుల భవితవ్యం.
నాలుగు జిల్లాలో పది నియోజకవర్గాలు లెక్కింపు. ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు. 289 పోలింగ్ కేంద్రాలు, 21రౌండ్లు…….!
హాజీపూర్ మండలం ముల్కల్లలోని ఐజా ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాల ఓట్లు అదే కళాశాల భవనంలో లెక్కిస్తారు. కౌంటింగ్ కేంద్రంలో భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ గదుల తలుపులకు ట్రిపుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 144 సెక్షన్ విదించారు.
telangana election 2023
నల్లగొండ జిల్లా లో 6 నియోజక వర్గాలు..
నల్గొండ జిల్లాలో పోలింగ్ 85.49% నమోదు. నల్లగొండ, నకిరేకల్,మునుగోడు, దేవరకొండ,నాగార్జున సాగర్, మిర్యాలగూడ. నల్గొండ జిల్లా కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డు దుప్పలపల్లి గోదాంలో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ ఉంటుంది.
సూర్యాపేట జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు :- 84.83 % పోలింగ్ జరిగింది సూర్యాపేట, హుజుర్నగర్, కోదాడ, తుంగతుర్తి సూర్యాపేట జిల్లా లోని నాలుగు నియోజకవర్గాల EVM లు సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్ లో స్ట్రాంగ్ రూం లో బద్రపరిచారు.. ఎన్నికల సిబ్బంది అక్కడే కౌంటింగ్ నిర్వహిస్తారు.
యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు :- భువనగిరి, ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03% పోలింగ్ నమోదు. భువనగిరి లోని ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ జరుగుతుంది.
తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీరసావర్కర్ విగ్రహం వరకు రెండు కిలో మీటర్ల మేర సాగిన బీజేపీ రోడ్డు షోలో ప్రధాని పాల్గొన్నారు. ప్రజలకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మోదీపై అభిమానులు పూలవర్షం కురిపించారు. ఈ రోడ్డు షోలో మోదీ వెంట కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ఉన్నారు. రోడ్డు షో కాచిగూడ చౌరస్తాకు చేరుకున్న తర్వాత వీరసావర్కర్ విగ్రహానికి మోదీ పూలమాల వేశారు. ప్రధాని రోడ్డు షో నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా చర్యల్లో భాగంగా చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. రోడ్డు షోతో తెలంగాణ బీజేపీలో ఊపు వచ్చిందని నేతలు భావిస్తున్నారు.
నవంబర్ 30న పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి సి.హెచ్.మధుమోహన్ అన్నారు.
పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లపై పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి సి.హెచ్. మధుమోహన్ పత్రికా సమావేశం నిర్వహించారు.
పెద్దపల్లి రిటర్నింగ్ అధికారి మధుమోహన్ మాట్లాడుతూ….. నవంబర్ 28న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగిస్తుందని, ఎన్నికల కమీషన్ నిబంధనల ప్రకారం పెద్దపల్లి నియోజక వర్గంలో పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందు నుంచి అనగా నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ పాటించాలని తెలిపారు.
స్థానికేతరులు నియోజకవర్గం విడిచి వెళ్లి పోవాలని, హోటల్లలో, ఫంక్షన్ హాల్ లో ఉండి ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని , సైలెన్స్ పీరియడ్ 48 గంటల వరకు మద్యం షాపులు మూసి వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.
సైలెన్స్ పిరియడ్ లో ఎలాంటి సర్వేలు, ఒపీనియన్ పోల్స్, నాయకుల ఇంటర్వ్యూ, ఎన్నికల చర్చలు, ఫలితాలను ప్రభావితం చేసే వార్తలను మీడియాలో ప్రసారం చేయడానికి వీలులేదని, నవంబర్ 29, 30న పత్రికలలో ఎన్నికలకు సంబంధించిన ప్రకటనల జారీ కోసం ముందస్తుగా జిల్లా కేంద్రంలోని ఎం.సి.ఎం.సి. అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.
నవంబర్ 29న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అప్పగించి పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని, పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించామని, అవసరమైన మేర సెక్టార్ అధికారులను నియమించామని అన్నారు.
నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని, పోలింగ్ అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి పోలింగ్ సిబ్బంది, ఈవిఎం యంత్రాలు, వివిప్యాట్ లను తరలిస్తారని, నవంబర్ 30న రాత్రి సమయంలో పోలీస్ ఎస్కార్ట్ తో కౌంటింగ్ కేంద్రంలోని స్ట్రాంగ్ రూమ్ కు ఈవీఎం యంత్రాలు, వివి ప్యాట్లను తరలించడం జరుగుతుందని తెలిపారు.
ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన మేర భద్రత ఏర్పాట్లు చేశామని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా క్షేత్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వెలెన్స్ బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తున్నాయని అన్నారు.
పెద్దపల్లి లో పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అవసరమైన వసతులు కల్పించడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ర్యాంపులు ఏర్పాటు చేశామని, త్రాగునీటి సౌకర్యం , ఓటరు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు . పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 575 మంది వృద్దులు, దివ్యాంగుల ఓట్లు ఇంటి నుంచి సేకరించామని అన్నారు. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 159 లోకేషన్లలో 290 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, వీటిలో 32 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, 12 వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించామని, అక్కడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకారం అందించాలని ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తాజాగా ఓట్ల లెక్కింపు కేంద్రాలపై స్పష్టత వచ్చింది. డిసెంబర్ 3న నిర్వహించనున్న కౌంటింగ్ కోసం గ్రేటర్ పరిధిలో మొత్తం 49 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించగా.. ఒక్క హైదరాబాద్ లోనే మొత్తం 14 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. ఇందులో భాగంగానే ఏర్పాట్లను శరవేగంగా పూర్తిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో పోలైన ఓట్లను యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు ప్రత్యేక కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాలు, రంగారెడ్డి జిల్లాలో 4, మిగిలిన జిల్లాల్లో ఒక్కో కేంద్రాన్ని ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమై ఉన్నామని తెలిపారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. పదేళ్లు కేసీఆర్కు అవకాశం ఇస్తే.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ కు మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ పరిస్థితిని ఊహించలేమన్నారు. వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు.తెలంగాణ తీసుకొచ్చామని చెప్పిన వారికి పదేళ్లు అవకాశం ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ కాదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎంతో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. మరి అలాంటి కాంగ్రెస్కు ఒక్క అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ప్రజలపై లేదా? భారాసకు మరో అవకాశం ఇచ్చే విషయంలో ఈ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం’’ అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
గత కాంగ్రెస్, ఎర్రజెండాల పాలనలో కనీసం బుక్కెడు తాగు నీళ్లకు హుస్నాబాద్ నోచుకోలేదని, కానీ నేడు తాగునీటితో పాటు సాగునీరు సమృద్ధిగా అందుతూ బంగారంలా రెండు పంటలు పండుతున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం, రోడ్ షోలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కోతల రాయుుడు పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ కు వచ్చాడని, కరీంనగర్ లో మూడు సార్లు చిత్తుగా ఓడిపోయి అక్కడ చేతకాక హుస్నాబాద్ కు వచ్చాడని ఎద్దేవా చేశారు.
తెలంగాణాలో కేసీఆర్ మీటర్లు పెట్టలేదని అందుకే రాష్ట్రానికి 35,000 కోట్లు ఆపామని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారని, 35 వేల కోట్లు ముఖ్యం కాదని రైతుల సంక్షేమమే ముఖ్యమని కేసీఆర్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదన్నారు.
కరెంట్ కావాలో కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు.
కర్ణాటకలో 5 గ్యారంటీ లని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో గతంలో 9 గంటల వచ్చే కరెంట్ ఇప్పుడు 3 గంటలు కూడా రావట్లేదని, అన్నింటిలో కోతలు విధిస్తున్నారని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కంటే బిఆర్ఎస్ మేనిఫెస్టో నూరు పాల్లు నయ్యమని, ఎగపెట్టిన చరిత్ర కాంగ్రెస్ ది అయితే అమలు చేసిన చరిత్ర బిఆర్ఎస్ దన్నారు. మూడు గంటల కరంటోడు కాంగ్రెస్ ఓ దిక్కు, మీటర్ల బిజెపోడు ఓ దిక్కు, 24 గంటల ఉచిత కరెంటు కేసిఆర్ ఓ దిక్కు ఉన్నారని, ఏ దిక్కుకు, ఎటుండాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.
ప్రజలే హై కమాండ్ గా పనిచేసే పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని, హుస్నాబాద్ అభివృద్ధికి తానే స్వయంగా బాధ్యత తీసుకుంటానన్నారు.
50 వేలకు పైగా మెజారిటీతో సతీష్ కుమార్ గెలవడం పక్క అని జోస్యం చెప్పారు.
ములుగు జిల్లా
ప్రముఖ పర్యటక కేంద్రమైన రామప్ప గెస్ట్ హౌస్ లో కర్ణాటక కు చెందిన మాజీ కాంగ్రెస్ మంత్రి విడిది. కర్ణాటక నుండి భారీగా డబ్బు సంచులు తీసుకొనివచ్చి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కోసం పంచడానికి నిలువ ఉంచారని తప్పుడు సమాచారం. రామప్ప గెస్ట్ హౌస్ లో వద్ద భారీగా చేరుకొన్న బిఆర్ఎస్ నాయకులు మీడియా ప్రతినిధులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్యాడ్ అధికారులు, పోలీసులు. గెస్ట్ హౌస్ లో తెల్లవారుజామున మూడు గంటల నుండి సోదాలు. ఎన్నికలకు సంబంధించిన డబ్బులు ఇతర వస్తువులు దొరకకపోవడంతో ఫేక్ న్యూస్ అంటూ వెనకకు తిరిగిన అధికారులు.
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్దనగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు. జామే ఉస్మానియా, ఈశ్వరీబాయి నగర్, ఎల్ నారాయణ నగర్, అంబర్ నగర్, బౌద్ధనగర్, సంజయ్ గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ పర్యటనకు
ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆయనను అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గతంలో తాము చేపట్టిన వివిధ శాశ్వత చర్యల వల్ల ప్రజలు భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు తప్పాయని, సికింద్రాబాద్ పరిధిలో పలు ప్రధాన నాలా ల వెడల్పు, కల్వర్టుల పునర్నిర్మాణం వంటి పనులను చేపట్టామని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో కరోనా నివారణ చర్యలను నిరంతరం తీసుకొని ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. నిరంతరం ప్రజల సమస్యలను తీర్చేందుకు సితాఫలమండీ లో తమ కార్యాలయం ఏర్పాటు చేసుకొని నిజాయితీగా ప్రజలకు సేవలను అందించే సిబ్బందిని ఈ కార్యాలయంలో నియమించుకున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో నిలిచిన తమకే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.




Total views : 149859