అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జిల్లాలో పకడ్బందిగా నిర్వహించేందుకు, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు. జిల్లాల్లో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, ఈ వీఎంయంత్రాల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగుల ను పోలింగ్లోభాగస్వామ్యం చేసేలా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ నిర్వహణకు డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని, విధులు నిర్వహించే పోలింగ్ సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లు కల్పించాలని అన్నారు.
youth
నారా లోకేష్ యువగళంతో మళ్లీ ప్రభంజనం మొదలైందన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. సీఎం జగన్ రాజకీయాలకు ఇక పుల్ స్టాప్ పడినట్లే అన్నారు. యువగళానికి వస్తున్న జనాదరణ చూసే వైసీపీ నేతలు బెంబేలెత్తుతున్నారని చెప్పారు. అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసిన వచ్చే ఎన్నికల్లో జనసేన – టీడీపీ జెండా ఎగరడం ఖాయం అంటున్న కొల్లు రవీంద్ర.
చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలో ప్రచారం చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను వింజమూర్ గ్రామ యువకులు అడ్డుకున్నారు.
గతంలో 2018 సంవత్సరంలో వింజమూరు గ్రామస్థులకు వింజమూరు గేట్ నుండి ఊర్లో వరకు రోడ్డు వేస్తానని రోడ్లు వేస్తేనే ఓట్లు అడుగుతానని వాగ్దానం చేసి రోడ్లు వేయించకపోవడంతో ఆ గ్రామ యువకులు రోడ్లు వేయించకుండా ఓట్లు అడగడానికి ఎందుకొచ్చావని ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకోవడం జరిగింది.
తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని కన్నవరం గ్రామంలో సోమవారం నాడు ఒకేరోజు మూడు గ్రావెల్ క్వారీ లు ప్రారంభించడంతో ఒక్కసారిగా 200 నుండి 300 టిప్పర్లు గ్రావెల్ క్వారీ మట్టితో తమిళనాడుకి తరలిస్తూ ఉన్నారు తద్వారా కన్నవరం , రాజుగుంట రాజుల కండ్రిగ మార్గం పూర్తిగా దెబ్బతిని పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో ఈ మార్గంలో ప్రయాణం చేయాలంటే ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకొని ప్రయాణం చేయవలసి వస్తుందని గ్రామస్తులు ఆవేశానికి గురై కన్నవరం గ్రామంలోని గ్రావెల్ క్వారీలు మార్గం వద్ద ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువత మీడియాతో మాట్లాడుతూ మా కన్నవరం గ్రామంలో స్థానిక వైసీపీ నాయకుల అండదండలతో నడుపుతున్నటువంటి గ్రావెల్ క్వారీ యజమానులు వెంటనే నిలిపివేయాలని లేనిపక్షంలో క్వారీ నిలిపేంతవరకు నిరసన కార్యక్రమాలు ఉదృతం చేస్తామంటూ మీడియా ద్వారా హెచ్చరించారు.కొందరు యువకులు టిప్పర్లు క్వారీలకు వెళ్లకుండా వెనక్కి తిరిగి పంపించేశారు.ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి మా గ్రామంలో క్వారీలు నడపకుండా ఉండేందుకు అనుమతులు ఇవ్వకుండా మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా మరి మరి కోరుతున్నామని వారు వాపోయారు.




Total views : 141508