కడప జిల్లా…నగరంలో కీలకమైన ప్రాంతం రాజారెడ్డి వీధి. జిల్లా ఎస్పీ బంగ్లా నుంచి జిల్లా గ్రంధాలయం వరకు ఈ రహదారి మంచి వ్యాపార కేంద్రం. ఈ ప్రాంతం వ్యాపారులకు అడ్డా. ఎలక్ట్రానిక్ షోరూమ్స్ మొదలుకొని హోటల్స్..జిమ్ బ్యాంకులు.. ఇలా ఎన్నో వాటికి అడ్డా ఇది. ఇక్కడ బిజినెస్ కోసం సెంటు స్థలం దొరికితే చాలు ఆనందానికి హద్దులు ఉండవు. అలాంటి ప్రాంతంలో సుమారు 30 సెంట్ల స్థలం.. అందులోనూ సుమారు 15 కోట్ల విలువ చేసే స్థలం కనిపిస్తే ఊరుకుంటారా , కోట్ల విలువ చేసే స్థలం వైసిపి నేతలపరం…కడప కార్పొరేషన్ లో నెంబర్-2 గా చలామణి అవుతున్న వ్యక్తి కన్ను పడితే..వ్యూహాత్మకంగా పావులు కలిపి బినామీ పేరుతో సొంతం చేసుకుంటారు. ప్రస్తుతం ఈ స్థలం వివాదాస్పదంగా మారింది.
నగరంలోని రాజారెడ్డి వీధిలో పోలీస్ పెట్రోలు బంకు సమీపంలో ఖాళీ స్థలం ఉంది. పోలీస్ శాఖ కు సంబంధించిన ఈ స్థలంపై కార్పొరేషన్ పాలకవర్గంలో నెంబర్ 2 గా ఉన్న వైసీపీ నేత కన్ను పడింది. కడప లో కరుడు కట్టిన వైసిపి నాయకులకు తెలియకుండానే ఆయన వ్యూహాత్మకంగా సుమారు 15 కోట్ల విలువ చేసే 30 సెంట్ల స్థలాన్ని కాజేసేందుకు పక్కా స్కెచ్ వేశారు. వివాదంలో ఉన్నప్పటికీ ఆ స్థలాన్ని అప్పటి పోలీస్ బాస్ ను మేనేజ్ చేసి మరీ ఒప్పందం చేసుకొని.. ఆ స్థలంలో తనదైన స్టైల్ లో నిర్మాణాలు కొనసాగించారు. ప్రభుత్వ మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో ఆ స్థలం లీజు వ్యవహారం బయట పడింది. న్యాయస్థానంలో వివాదంలో ఉన్న స్థలాన్ని అప్పటి పోలీస్ బాస్ చడి చప్పుడు కాకుండా వైసిపి నేత బినామీకి కట్టబెట్టిన వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- CVR NEWS LIVEAdvertisements
- కడప లో వైసీపీకి షాక్టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు… పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్.. వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు… చక్రాయపేట,వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు…
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి