218
రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం..పంచాంగ శ్రవణం అనంతరం ప్రసంగించారు. ఉగాది ప్రధానంగా రైతుల పండుగ అని.. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందన్నారు. తెలంగాణలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయన్న ముఖ్యమంత్రి..రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేశామన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతు భరోసా ద్వారా ఇప్పటికే 18వేల కోట్ల రూపాయలిచ్చామని..ఈనెల 22 నుంచి మళ్లీ రైతు భరోసా ప్రారంభమవుతుందని తెలిపారు.






Total views : 141209