Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News హోటళ్ల పై ఆకస్మిక తనిఖీలు….

హోటళ్ల పై ఆకస్మిక తనిఖీలు….

by Prakash
Random checks

కుళ్ళిన, చెడిపోయిన ఆహార పదార్థాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మెట్ పల్లి పట్టణంలోని పలు హోటళ్లపై మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని ఆర్ బి రెస్టారెంట్లో చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించిన మున్సిపల్ కమిషనర్ యజమానిపై మండిపడ్డారు. చెడిపోయిన ఆహార పదార్థాలను మున్సిపల్ చెత్త వాహనంలో బయటకు తరలించారు. అనంతరం 10 వేల రూపాయలు జరిమానా విధించారు. రెస్టారెంట్లో తినడానికి వచ్చిన వారితో ఆహారం విషయంలో కల్తీ ఉన్నట్లయితే మున్సిపల్ ఆఫీసులో ఫిర్యాదు చేయాలని కమిషనర్ తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

026165
Total views : 149987

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.