Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh పథకాలు అందితేనే ఓటు వేయండి..

పథకాలు అందితేనే ఓటు వేయండి..

by Rama
Adimulapu suresh

ప్రకాశం జిల్లా దరిశి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఒంగోలు ఎద్దుల పందాలు కార్యక్రమంను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఇన్చార్జి మంత్రి మెరుగు నాగార్జున ప్రారంభించారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో న్యూ క్యాటగిరి, సీనియర్ విభాగం పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం ఇవి రెండు కళ్లలా భావించి ఏ ముఖ్యమంత్రి పరిపాలించనంత సుభిక్షంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తున్నారు. మీకు సంక్షేమ పథకాలు అందితేనే మాకు ఓటు వేయండి అని ధైర్యంగా మీ ముందుకు వస్తున్నాం అన్నారు. ప్రతిపక్షాలు పొత్తుల్లో భాగంగా రెండు మూడు కండువాలు వేసుకొని కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. దర్శి నియోజకవర్గంలో మరోసారి బూచేపల్లినీ సమన్వయకర్తగా అవకాశం ఇస్తారని మీరు మరోసారి ఆదరించి గెలిపించాలని మంత్రి అన్నారు. దరిశి లో బూచేపల్లి గెలిస్తే రాష్ట్రంలో జగనన్న గెలుస్తాడని ఆయన అన్నారు.

Advertisements

You may also like

Our Visitor

014620
Total views : 80615

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.