Tuesday, May 19, 2026
News Navigation
Tuesday, May 19, 2026
News Navigation

Breaking

Tuesday, May 19, 2026
Home Andhra Pradesh శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…

by Prakash
కాంగ్రెస్, Congress MLAs visited Srisailam Mallanna

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న బీహార్ కు చెందిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారి దర్శనార్థం ఆలయ రాజా గోపురం వద్దకు చేరుకున్న బీహార్ కాంగ్రెస్ 22 మంది ఎమ్మెల్యేలకు ఆలయ మర్యాదలను అనుసరించి ఆలయ అధికారులు అర్చకస్వాములు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేలు శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనానంతరం ఎమ్మెల్యేలకు శ్రీ స్వామి అమ్మవార్ల లడ్డు ప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు. అయితే గత కొద్ది రోజులుగా బీహార్లో ప్రభుత్వంపై బల ప్రదర్శన నిర్వహించాలని ఈ నెల 12న బలపరీక్ష ఉండడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పుణ్యక్షేత్రాలకు తిప్పుతున్నారని సమాచారం. అందులో భాగంగానే నేడు శ్రీశైలం, రేపు జోగులాంబ గద్వాల జిల్లాకు వెళుతున్నట్టుగా సమాచారం బీహార్ ఎమ్మెల్యేల వెంట తెలంగాణ అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కూడా వెంటే ఉండి బీహార్ ఎమ్మెల్యేకు దర్శన ఏర్పాట్లు దగ్గరుండి చూస్తున్నారు. శ్రీశైలం పర్యటన దర్శనానంతరం తెలంగాణ అలంపూర్ జోగులాంబ ఆలయానికి బీహార్ ఎమ్మెల్యేలు వెళ్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.

Read Also…

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow us on : Facebook, Instagram & YouTube.

Advertisements

You may also like

Our Visitor

014700
Total views : 80882

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.