పశ్చిమ గోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. సిద్ధాంతం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం, గత వైసీపీ ప్రభుత్వం భూసర్వే పేరుతో భారీ అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. భూ రికార్డులు మార్చి ప్రజల భూములను దోచుకోవాలని ప్రయత్నించారని విమర్శించారు. రైతుల హక్కులను కాపాడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ముగ్గురు రైతులతో వ్యవసాయ క్షేత్రంలో చంద్రబాబు నేరుగా మాట్లాడారు. CVR న్యూస్ తో రైతులు చంద్రబాబు నాయుడుని కలవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రిని కలుస్తామని ఏనాడు ఊహించలేదని అన్నారు. పొలంలోకి వచ్చి మాతో మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని… వ్యవసాయానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉంటే వాటిని ఆయనకు చెప్పామన్నారు. త్వరలోనే సీఎం పరిష్కరిస్తామన్నారని రైతులు తెలిపారు. సిద్ధాంతం గ్రామంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జరిపిన పర్యటన, క్షేత్రస్థాయిలో రైతుల సాధకబాధకాలను తెలుసుకోవాలనే ఆయన నిరంతర ప్రయత్నానికి నిదర్శనమన్నారు.కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా ప్రజల వద్దకు, రైతుల పొలాల్లోకి వెళ్లడం ద్వారా క్షేత్రస్థాయి వాస్తవాలు పాలకులకు స్పష్టంగా తెలుస్తాయి. వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యత ఈ పర్యటన ద్వారా కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి స్వయంగా రైతుల సమస్యలను నోట్ చేసుకోవడం అధికారులపై కూడా సానుకూల ఒత్తిడిని పెంచుతుంది.





Total views : 141374