తమిళనాడు హోసూరులో దారుణం చోటుచేసుకుంది. హోసూర్ సమీప అటవీ ప్రాంతంలో ఓ ఏనుగు దాడి చేసిన ఘటనలో ఓ ఆవుతో పాటు ఇద్దరు మహిళలు మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, అటవీశాఖ అధికార్లను అప్రమత్తం చేశారు. మృతి చెందిన వారు అన్నియాలం గ్రామానికి చెందిన వసంతమ్మ, అశ్వత్తమ్మగా పోలీసులు గుర్తించారు. మహిళల మృతితో అన్నియాలం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావంతో చమురు ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు మరో షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. దీంతో వారం రోజుల్లోనే ఇంధన ధరలు మళ్లీ పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడుతోంది.…
భారతీయ వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి అమెరికాలో భారీ ఉపశమనం లభించింది. న్యూయార్క్లో కొనసాగుతున్న హై-ప్రొఫైల్ సెక్యూరిటీస్, వైర్ ఫ్రాడ్ కేసులో ఉన్న అన్ని క్రిమినల్ ఆరోపణలను అమెరికా న్యాయ శాఖ…
చీర కట్టు, నుదుటన బొట్టుతో ఓ భారత నటి ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది. ప్రముఖ మహారాష్ట్ర నటి ప్రజక్తా మాలి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన సాంప్రదాయిక లుక్తో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. పాశ్చాత్య దుస్తుల హడావుడి…