Wednesday, March 11, 2026
News Navigation
Home Latest News నన్ను అనవసరంగా గెలకొద్దు…

నన్ను అనవసరంగా గెలకొద్దు…

by Prakash
Bandi Sanjay

Bandi Sanjay :

రేషన్ కార్డులు ఉన్నవారికే 6 గ్యారంటీలు అమలు చేస్తామంటే పేదలను మోసం చెయ్యడమేనని, ముందు అర్హులైన పేదలకు నూతన రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాతే గ్యారంటిలు అమలు చేయాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు ఎంపీ బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజాహిత యాత్ర చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పై చురకలు విసిరారు. గత ప్రభుత్వంపై ప్రజల సమస్యల కోసం కొట్లాడితే నా మీద వంద కేసులు పెట్టి జైలుకు పంపారని, ఇక్కడున్నా నాయకుడు పెద్దమనిషి ఏమయినా కొట్లాడాడా ఆయన మీద ఏమైనా కేసులు అయ్యాయా అని ప్రశ్నించారు. గౌరవెల్లి భూ నిర్వాసితులకు ఇంతవరకు పరిహారం అందలేదని, వారు జైలుపాలు, గాయల పాలై ఉంటే రాత్రికి రాత్రి వచ్చి వారిని ఆస్పత్రికి తీసుకుపోయి కాపాడనన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్, కేటీఆర్ కు కేవలం తన మీద ఆడిపోసుకోవడం తప్ప వేరే పనిలేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ఇందిరమ్మ రాజ్యం తేస్తామంటూ ఆమె పాలనలో వచ్చిన ఎమర్జెన్సీని తెస్తారేమోనని అనుమానం వస్తుందన్నారు. 90 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చెయ్యనోల్లు పది రోజుల్లో చేస్తారా అని, గ్యారంటీల అమలు విషయమై తను మాట్లాడితే రాముని విషయం వారు మాట్లాడుతున్నరన్నారు. రేవంత్ రెడ్డి పిసీసీ అధ్యక్షుడిగా ఉండడం ఇష్టం లేకనే ఆయనను తీసేయాలని ఇక్కడున్న పెద్ద మనిషి పొన్నం గొడువ చేస్తున్నడన్నారు. కేసిఆర్ పది ఎండ్లలో 5 లక్షల కోట్ల అప్పు చేస్తే, 2 నేలల్లోనే కాంగ్రెస్ వాళ్లు 10 వేల కోట్ల అప్పు చేశారని ఎద్దేవా చేశారు.

Follow us on : FacebookInstagram & YouTube.
రాముడు అయోధ్య లో పుట్టిండ అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారని, తను మా అమ్మకు పుట్టినట్టు గ్యారంటీ అక్కడున్న నర్సులు, డాక్టర్ లు చెప్తారన్నారు.
ఈ విషయమంటే తన పై కాంగ్రెస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తూ రాద్దాంతం చేస్తున్నరన్నారు. సంస్కార హీనులు కాంగ్రెస్ వాళ్లని, తను సంస్కార హినున్ని కాదని, మా తల్లి ఆయన తల్లి అయిన ఇద్దరు తనకు సమానమేనన్నారు. అందరూ తల్లులు నా తల్లితో సమానమని, మీరు చెడు ఉద్దేశాలు అపదించుకొని ఆమెను అవమాన పరుస్తున్నరన్నారు. తను ఎంపిగా గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, మీరు పెట్టిన కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే నువ్వు మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటావో లేదో చెప్పాలి.
కేటీఆర్ తో బీఆర్ఎస్ కథమైందని, ఇక్కడున్న పెద్ద మనిషి పొన్నం ప్రభాకర్ తో కాంగ్రెస్ కూడా నాశనం అవుతుందని ఎద్దేవా చేశారు. రేషన్ బియ్యం మీద ఫోటోలు పెట్టుకుంటున్న కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు బియ్యం ఇవ్వవద్దని ప్రధాని మోడీకి లేఖ రాస్తానని, ఇక రేపటి నుండి వాళ్ళ రేషన్ బియ్యం ఇవ్వాలన్నారు. అభివృద్ధికి కలిసి పనిచేద్దామంటే, అనవసరంగా తనను గెలుకుతున్నారని మండి పడ్డారు. ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని అడిగితే తన ఫ్లెక్సీలు చింపేయడంతోపాటు అందులోని రాడ్లు కూడా ఎత్తుకెళ్తున్నారని విమర్శించారు.

Read Also…
Advertisements

You may also like

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.