అల్లు అర్జున్ ,సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించిన సినిమా పుష్ప 2. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న విడుదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ లో ఈ సినిమా చూడడానికి అల్లు అర్జున్ కూడా వచ్చాడు . నేరుగా అల్లు అర్జున్ సినిమా చూడడానికి వస్తున్నాడు అని తెలియడం తో అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకున్నారు . ఈ క్రమంలోనే సంథ్య థియేటర్లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు.. ఆమె కుమారుడుకి తీవ్ర గాయాలయ్యాయి . దానితో ఆ ఘటనపై చిక్కడ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్ను కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. మహిళ మృతిపై అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు . నా తరఫున బాధిత కుటుంబానికి రూ.25లక్షలు అందిస్తాను . అలాగే మా మూవీ టీమ్ నుంచి ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. వారికి నా వల్ల అయినంత సాయం చేస్తాను. త్వరలోనే రేవతి కుటుంబాన్నిస్వయంగా కలుస్తాను’ అని భరోసా ఇచ్చాడు అల్లు అర్జున్. పోలీసులు అల్లుఅర్జున్ ని అరెస్ట్ చేయడంతో భార్య స్నేహరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు ఇంటికి రావడంతో టెన్షన్ పడిన స్నేహారెడ్డికి ధైర్యం చెప్పారు అల్లు అర్జున్ .ఆకస్మాత్తుగా బన్నీ అరెస్ట్ చేయడంతో సినీవర్గాలతోపాటు అభిమానులు షాకయ్యారు
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- మున్సిపల్ ఎన్నికల తర్వాత ఆసక్తికర పరిణామాలుమున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు తామిచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మేడ్చల్లో డబ్బులు తిరిగివ్వమని అడిగిన అభ్యర్థి భర్తపై తిరగబడ్డారు ఓటర్లు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని బండమాచారం19వ వార్డులో పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి ఓటమి…
- ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావులఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల .ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3 లక్షల 32 వేల 205 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. తమ దృష్టిలో…
- శ్రీశైలం మల్లన్న దర్శనానికి కాలినడకన భక్తులునంద్యాల జిల్లా శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు 40 కిలోమీటర్లు నల్లమల అడవుల్లో పాదయాత్ర చేస్తూ మల్లన్న దర్శనం కోసం వెళ్తున్నారు. Advertisements
- అసోంలో ప్రధాని మోదీ పర్యటనఅసోంలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. భారత ఎయిర్ఫోర్స్ విమానంలో వచ్చిన ప్రధాని..రోడ్డుపైనే ల్యాండ్ అయ్యారు. దిబ్రూఘర్ దగ్గర ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం రోడ్డుపైనే ల్యాండ్ అయింది. అసోం పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.…
- ఏపీ బడ్జెట్ ప్రతులకు ఆర్థిక మంత్రి పయ్యావుల పూజలుఏపీ బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆర్ధిక మంత్రి పయ్యవుల కేశవ్..తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో అధికారులు తో కలిసి పూజ నిర్వహించారు..బడ్జెట్ కాపీ ని తీసుకుని వెంకట పాలెం వెంకటేశ్వర స్వామి దేవాలయం లో పూజలు నిర్వహించారు..అక్కడ…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి