Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Latest News కేసీఆర్ పై జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు…

కేసీఆర్ పై జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు…

by Prakash
Jupalli Krishna Rao

ముఖ్యమంత్రి కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి చేయకుండా తాను గద్దినెక్కాడని తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టిస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ఏ ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదని, 9 ఏళ్ల క్రితం రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానన్నావు చేసావా, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు కల్పించారా అంటూ సిఎంని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేసారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం కుడికిళ్ల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మాటలు చెప్పే మనిషే కానీ మాట మీద నిలబడే మనిషి కాదని దళితున్ని ముఖ్యమంత్రి ని చేస్తానని చెప్పి తానే తొమ్మిది ఏళ్లుగా ముఖ్యమంత్రి పదవిని అనుభావిస్తున్న మాటకరని రాష్టంలో ఉన్న నిరీద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తన కుటుంబ సభ్యులకు పదవులను కట్టబెట్టిన ఘనత కేసీఆర్ ది అన్నారు. ఈరోజు యావత్ రెండు తెలుగు రాష్ట్రాల రైతాంగానికి ఉచిత కరెంట్ వస్తుందంటే అందులో తన పాత్ర ఉందని ఆనాడు రైతులకు అదనంగా కరెంట్ చార్జీలు వసూలు చేస్తుంటే రైతు సమస్యలపై పోరాడి కొట్లాడి రైతన్నలకు ఉచిత కరెంట్ కల్పించిన ఘనత నాది అన్నారు. వందలాది మంది యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం పిట్టల్లా చనిపోతుంటే చూడలేక మంత్రి పదవిని సైతం రాజీనామా చేశాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో నాపాత్ర ఉందని ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశానని చెప్పుకొచ్చారు. గత 19 యేండ్లుగా నియోజకవర్గంలో నేను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని నేడు మీరు చూస్తున్న ప్రాజెక్టులు రైతు బంధు రైతు భీమా నీటి కాలువలు పెంక్షన్లు సీసీ రోడ్లు కరెంట్ ప్రభుత్వ భవనాలు ఇలా చెప్పుకుంటు పోతే నేడు మీరు చూస్తున్న అభివృద్ధి నేను చేసిన అభిద్దే అన్నారు. ప్రజలు తెలంగాణ రాష్టంని ఇచ్చిన సోనియా గాంధీ ఋణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చిందని రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని కాదని వేరే పార్టీలకు ఓటు వేస్తే మళ్ళీ ఇక్కడి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నే గెలుస్తాడు అన్నారు. పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలకోసం శ్రామిస్తానని కాంగ్రెస్ పార్టీని నన్ను మళ్ళీ ఒకసారి ప్రజలు అదరించి 30 న జరిగే ఎన్నికల్లోఆశీర్వదించి గెలిపించాలని కోరారు.

Read Also…

Read Also…

Advertisements

You may also like

Our Visitor

025993
Total views : 149654

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.