తమిళనాడులో మృతి చెందిన చిరుత పులి.. మృతిచెందిన చిరుతపులిను ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో వేసి వెళ్లిన తమిళనాడు ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్న చిత్తూరు డిఎఫ్ఓ చేతన్ కుమార్ తమిళనాడులో మృతి చెందిన చిరుతపులిని ఆంధ్రలో వేయాల్సిన అవసరం ఏమి అని ప్రశ్నించారు, చిరుతపులిని వేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని చిత్తూరు డిఎఫ్ఓ చేతన్ కుమార్ అన్నారు. గతంలో కూడా ఇదే తరహాలో ఆంధ్ర ఫారెస్ట్ అధికారులకు తమిళనాడు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఏనుగులు విషయంలో గొడవలు పడ్డ ఘటనలు కూడా ఉన్నాయి… .చిత్తూరు జిల్లా వి కోట మండలం నాయకనేరి అటవీ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి ప్రాంతంలో అటవీ మార్గంలోని ఆంజనేయస్వామి ఆలయం దాటక మలుపులో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెంది రోడ్డు మధ్యన పడి ఉంది..అటుగా వెళ్లిన వాహనదారులు చిరుత మృతి చెంది పడి ఉండటాన్ని గుర్తించి అటవీ శాఖకు సమాచారం ఇచ్చారు.. పలమనేరు అటవీ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన చిరుతపులిని పోస్టుమార్టం చేసేందుకు తరలించారు.మృతి చెందిన చిరుతకు పదేళ్ల వయసు ఉంటుందని ఆడ చిరుతగా గుర్తించారు..ఇంత వయసు ఉన్న చిరుత ఒంటరిగా ఉండే అవకాశం ఉండదని తోడుగా మరో చిరుత ఉండే అవకాశం ఉంటుందని అడవి శాఖ వారు భావిస్తున్నారు..అనంతరం చిరుతపులిని పోస్ట్మార్టం చేసి దహనం చేశారు.
వాహనం ఢీకొని చిరుతపులి మృతి…
315
previous post






Total views : 141350