Thursday, July 9, 2026
News Navigation
Thursday, July 9, 2026
News Navigation

Breaking

Thursday, July 9, 2026
Home Crime చెన్నూర్ పట్టణంలో వరుస దొంగతనాల కలకలం…

చెన్నూర్ పట్టణంలో వరుస దొంగతనాల కలకలం…

by Prakash
Manchryala District, Thefts
Manchryala District :

మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో వరుస దొంగతనాలు (Thefts) కలకలం రేపుతున్నాయి. మేడారం జాతర వేల తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా వరుస దొంగతనాలతో దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నారు. పట్టణంలోని విశ్వకర్మ కాలనీకి చెందిన బ్రహ్మయ్య అనే ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటి తాలాలు పగలగొట్టి సుమారు తులం బంగారు 40 వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన ముల్కల వీరారెడ్డి తన పక్కింటి వారితో కలిసి మేడారం జాతరకు వెళ్లగా ఇదే అదునుగా చేసుకుని దొంగలు రెండు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి విలువైన వెండి సామాగ్రి కొంత డబ్బును ఎత్తుకెళ్లారు. బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో వేలిముద్రలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisements

You may also like

Our Visitor

039013
Total views : 194054

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: