పలమనేరు ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న కరెంటు ఫోల్ను కర్ణాటక ఆర్టీసీ బస్సు. ఢీకొని రంగబాబు వరకు ఈడ్చుకొని వెళ్లిన వైనం, ఆ సమయానికి అక్కడ ప్రజలు ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రమాదం, సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది వెంటనే నష్ట నివారణ చేపట్టి కరెంటును పునరుద్ధరించారు, ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Accident
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కన్నాల జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొన్న లారీ. బైక్ ట్యాంకర్ పేలడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ ట్యాంకర్ పేలడంతో ఆకస్మాత్తుగ మంటలు చేయాలరేగి బైక్ నడిపే వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. ప్రత్యేక్షంగా ఉన్న వారు చూస్తుండగానే బైక్ నుండి మంటలు వ్యాపించి క్షణాల్లోనే బూడిద అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీస్ లు ఘటన స్థలనికి చేరుకొని ధర్యాప్తు చేస్తున్నారు. సజీవ దహనమైనా వ్యక్తి ఎవరు అనే కోణం లో పోలీస్ లు ధర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి పూర్తిగా కాలిపోవడం తో వివరాలు తెలియరాలేదు. పోలీస్ లు ధర్యాప్తు ను కొనసాగిస్తున్నారు.
చిల్లకూరు వరగలి క్రాస్ రోడ్ సమీపంలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ముగ్గురికి గాయాలు. శబరిమలై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న టెంపో ముందు వెళ్తున్న ఆటోను డీ కొట్టడంతో జరిగిన ప్రమాదం. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చిల్లకూరు పోలీసులు….
సుండుపల్లి మండలం బెస్తపల్లి దగ్గర ఆగి ఉన్న ద్విచక్ర వాహన దారుడు రామచంద్ర నాయక్ ను తిరుపతి నుంచి సుండుపల్లికి వస్తున్న ఆర్టిసి బస్సు డి కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రామచంద్ర నాయక్ ను ఆసుపత్రికి తరలించేందుకు 108 కు ఫోన్ చేసినప్పటికీ సకాలంలో సంఘటన స్థలానికి చేరుకోకలేక పొయ్యింది. మానవత స్వచ్చంద సంస్థ వారికీ చరవాణి ద్వారా సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన మానవత అంబులెన్స్ చోదకుడు చంటి ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని రామచంద్ర నాయక్ ను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు వారికీ ప్రాధమిక వైద్య సేవలు అందించి మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాలంటూ సూచించారు. ప్రమదం జరిగిందని సమాచారం ఇచ్చిన వెను వెంటనే సకాలంలో సంఘటన స్థలానికి చేరుకొని ఆసుపత్రికి చేర్పించిన మానవత సభ్యులకు, అంబులెన్స్ చోదకుడు కి వారి కుటుంబ సభ్యులు స్థానికులు ప్రసంసాభినందనలు తెలియజేశారు. గాయపడిన రామచంద్ర నాయక్ డి వాయిల్ దొడ్డి బిడికి గా పోలీసులు గుర్తించారు. సుండుపల్లి పోలీసులు జరిగిన సంఘటన పై కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, వి.కోట,నెర్నిపల్లి గ్రామం వద్ద కారు ఢీకొని యువకుడు మృతి, పోలీసుల కథనం మేరకు సోమవారం సాయంత్రం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామానికి చెందిన రాజు కుమారుడు బాలాజీ 28ఏళ్ళు తన ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తూ కారు ఢీకొనడంతో మృతి చెందాడని, పోస్టుమార్టం కొరకు పలమనేరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
కుప్పం సరిహద్దులోని తిరుపత్తూరు సమీపంలో రోడ్డు ప్రమాదం..తిరుపత్తూర్ నుండి కుప్పం వస్తున్న బస్సు అదుపు తప్పి చెట్టును ఢీ కొన్న తమిళనాడు ఆర్టీసి…10 మందికి పైగా గాయాలు..గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు..మరో బస్సును ఓవర్ టేక్ చేసే సమయంలో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
కర్ణాటక రాష్ట్రం షోలాపూర్ పట్టణవాసులు తుఫాన్ వాహనంలో శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటి కుంట సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనం టైర్ పంచరై అద్భుతప్పి బోల్తా కొట్టి సమీప పొలాల్లోకి నాలుగు పల్టీలు కొట్టడంతో వాహనంలో ప్రయాణిస్తున్న 17 మందిలో 12 మందికి గాయాలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని 108 వాహనం లో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయాలైన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సూచన మేరకు ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ప్రమాద సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.





Total views : 140857