సంగారెడ్డి రిటర్నింగ్ కార్యాలయం ముందు బీజేపీ నేత రాజేశ్వర్ రావు దేశ్ పాండే నిరసనకు దిగారు. శుక్రవారం విడుదలైన బీజేపీ అభ్యర్థుల చివరి జాబితాలో సంగారెడ్డి నుంచి రాజేశ్వర్ రావు దేశ్ పాండేకు బీజేపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. అయితే టికెట్ ఇచ్చినప్పటికీ బీ ఫామ్ ఇవ్వకపోవడంతో దేశ్ పాండే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్రెడ్డికి ఫోన్ చేసి మరీ వెక్కి వెక్కి ఏడ్చారు. తనకు బీ ఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బీజేపీ నేత హెచ్చరించారు.
Tag:
Beefam
జోగులంబా గద్వాల జిల్లా అలంపూర్ తనకు బీఫామ్ ఇవ్వకుండా అగ్రకులాల ఆధిపత్యం చేస్తూ అడ్డుపడ్డారని కనీసం ఒక జీవో కాపీ చదవలేని స్థితిలో ఉన్న వ్యక్తికి బీఫామ్ ఇవ్వడం ఏమిటని ఎమ్మెల్యే అబ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో జెండ కూడా మోయని ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి పార్టీ కోసం పనిచేయని వ్యక్తికి ఈరోజు బీఫామ్ ఇప్పించడంలో పెట్టిన శ్రద్ధ చాలా బాధగా ఉందని తన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. తనను నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు తమ భవిష్యత్తు కార్యాచరణను తామే నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకు సైలెంట్ గా ఉండటమే తన నిర్ణయం అన్నారు. అలంపూర్ ప్రజలకు తాను చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని అలంపూర్ ప్రజలు తనను ఎప్పుడూ మోసం చేయలేదని గుర్తు చేశారు.




Total views : 150414