అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన డ్రామాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ఆల్ రెడీ ఆదానీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నామని కాంగ్రెస్ సభ్యులు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనవసరంగా ఈ విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఏడాది పాలనలో ఎటువంటి లోపాలు లేనందు వల్లే .. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం తప్పులు చేస్తే ఎత్తిచూపాలి గానీ..ఈ విధంగా చేయడం సరికాదన్నారు. పాలనలో ఏవైనా లోపాలు ఉంటే చెబితే సరిదిద్దుకుంటామని, కానీ అవేమీ లేనందువల్లే బీఆర్ఎస్ డ్రామాలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతి తక్కువ సమయంలో ఎన్నికల్లో ఇఛ్చిన హామీలను అమలు చేస్తున్నామని, కానీ బీఆర్ఎస్ ఎక్కడ తమకు మైలేజీ వస్తుందోనని భావించి.. అనవసరమైన ఆందోళనలకు దిగుతోందని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు డ్రామాలు కట్టిపెట్టి.. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్ధతు పలకాలని కాంగ్రెస్ నేతలు హితవు పలికారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వచ్చేనెలలో భారత్కి వచ్చే ఛాన్స్.దాదాపు ఏడేళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భారత్లో పర్యటించే అవకాశం కనిపిస్తోంది. వచ్చే నెల 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొనే అవకాశమున్నట్లు సమాచారం. 2019లో చివరిసారిగా భారత్కు వచ్చిన షీ జిన్పింగ్,…
- పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. సముద్ర వేటకు వెళ్లిన బోటు.. ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి.. ఈదుకుంటూ ఒడ్డుకు…
- 22ఏపై బీజేపీ దీక్షలు.భూ భారతి పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సెక్షన్ 22ఏ కింద లక్షలాది ఎకరాల భూములను ప్రొహిబిటెడ్ జాబితాలో చేర్చి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ధరణి పోర్టల్పై నిర్వహించిన…
- సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా..…
- భారత సైన్యం చేతికి ‘షేర్’.. ఏకే-203 రైఫిళ్లు రెడీ.రక్షణ రంగంలో ఆత్మనిర్భరత దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లా కోర్వాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో దేశీయంగా తయారైన ఏకే-203 అసాల్ట్ రైఫిళ్లు భారత సైన్యానికి అందించేందుకు సిద్ధమయ్యాయి. త్వరలోనే వీటి డెలివరీ ప్రారంభం కానుంది. అత్యాధునికమైన…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి