మహారాష్ట్ర , ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉన్న అభ్యర్థుల భవితవ్యం తేలనున్నది. గెలుపుపై ఎవరు ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీ విజయం సాధిస్తుందనే అంచనాలు హోరెత్తిపోతున్నాయి. మరి ఇంతకు ప్రజల తీర్పు ఎవరిని విజయతీరాలకు చేర్చుతుందనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొన్నది.
మహారాష్ట్ర సమరంలో విజేతలెవరో తేలిపోనుంది. యావత్ దేశం దృష్టినీ తనవైపు తిప్పుకున్న మహారాష్ట్రలో.. బీజేపీ సారథ్యంలో మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటముల అభ్యర్థులు నువ్వా – నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు. వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ లో మహాయుతి కూటమిదే విజయం అని తేలింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి అధికారంలోకి వస్తుందని అంచనాకొచ్చాయి.ప్రతిపక్ష కూటమి అయిన మహావికాస్ అఘాడీ కూడా గెలుపు తమదవుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది. హర్యానా, జమ్ము ఎగ్జిట్ పోల్స్ తారుమారవ్వడంతో.. మహావికాస్ అఘాడీ గెలుపు ధీమాలో తప్పులేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మహాయుతి గెలిస్తే.. బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, ఎన్సీపీ నేత అమోల్ మిత్కారీ డిప్యూటీ సీఎంగా ఎన్నికవుతారని అంటున్నారు. ఎన్సీపీనే సీఎం ఎన్నికలో కింగ్ మేకర్ అవుతుందంటున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతి సమీపంలోని దామినేడులో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ…
- అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రిలీజ్.అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రత్యేక జాబితాలో భారత సంతతికి చెందిన ప్రముఖులు సత్తా చాటారు. అమెరికాలో నివసిస్తున్న విజయవంతమైన 250 మంది వలసదారుల జాబితాలో ఏకంగా 27 మంది భారతీయ మూలాల వ్యక్తులు చోటు…
- విమానంలో క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్ విమానంలో ప్రయాణించిన సచిన్… అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్…
- ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్లో బలమైన ఆరంభం.ఇంగ్లాండ్ మహిళల జట్టు, శ్రీలంక మహిళలపై జరిగిన తొలి మ్యాచ్లో అద్భుతమైన ఆధిపత్యాన్ని చూపుతూ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్బాస్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్, 20 ఓవర్లలో కేవలం 1 వికెట్…
- దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్ని ప్రమాదం.దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.తాజాగా తుగ్లకాబాద్లోని ఓ భవనంలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 141308