కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయలవ్వగ నాలుగు ద్విచ్రవాహనాలు, ఓ ఆటో ద్వంసమయ్యాయి. డ్రైవింగ్ లో ఏ మాత్రం అనుభవం లేని వ్యక్తి కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. దర్గా సెంటర్ నుండి స్టేట్ బ్యాంక్ కు వెళ్ళే దారిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడ్డ వారిని స్థానికులు హుటహుటీన పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు డ్రైవింగ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
Road Accident
ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం… కడప జిల్లా కాశినాయన జడ్పీటీసి సత్యనారాయణరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి పోరుమామిళ్ల వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తాపడటంతో ప్రమాదం జరిగింది. ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హుటాహుటిన ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, వైసీపీ నాయకులు బయలుదేరారు. సంఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు నగర శివారులోని చెర్లోపల్లి వద్ద ఘటన. శ్రీవారి దర్శనం అనంతరం తిరుమల నుండి మైసూర్ కి వెళుతుండగా ఘటన.. డ్రైవర్ నిద్రపోవడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సుజాత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు మహిళలు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. డ్రైవర్ శివకుమార్ పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సిఎంసి ఆసుపత్రి కి తరలించారు. చిత్తూరు తాలూకా ఎస్సై ఉమామహేశ్వర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదకటనపై విచారణ చేపట్టారు. మృతుల కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్న సిఐ గంగిరెడ్డి…
సీతానగరం మండలం గోదారి గట్టు రహదారిపై రోడ్ ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి దుర్మరణం.. మృతుడు వంగలపూడి గ్రామానికి చెందిన పిటక వెంకటేశ్వరరావు (32),గా గుర్తింపు.. ఘటనా స్థలం భారీగా నిలిచిపోయిన వాహనాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడు సీతానగరం నుండి వంగలపూడి వెళుతుండగా జరిగిన ప్రమాదం…
కర్ణాటక చిక్కబళ్లాపుర్లో ఆగి ఉన్న ట్యాంకర్ను టాటా సుమో వాహనం ఢీకొట్టగా.. 8 మంది మరణించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. పొగ మంచు వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతులంతా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కూలీ పనుల కోసం బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగింది.




Total views : 141484