309
అంగన్వాడీ వర్కర్ల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం తక్షిణమే పరిష్కరించాలని టిడిపి నేత కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అంబేద్కర్ సెంటర్లో నిరసన దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా టిడిపి నేత కొవ్వలి యతిరజా రామ్మోహన్ నాయుడు దీక్ష శిబిరంను సందర్శించి సంఘీభావం తెలిపారు. ప్రజలకు నిత్యం సేవలందిస్తున్న అంగన్వాడి వర్కర్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన అన్నారు. కనీస వేతనం, గ్రాట్యుటీ, ప్రభుత్వ పథకాలు అందించాలని వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.




Total views : 75371