Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Telangana ఓ ప్రేమజంట ఆత్మహత్య

ఓ ప్రేమజంట ఆత్మహత్య

by Satya
love couple

ములుగు జిల్లా మంగపేటలో విషాదం చోటుచేసుకుంది. మల్లూరు అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించింది.ఈ ఘటనలో యువకుడు మృతి చెందగా , యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఏటూరునాగారం మండలం కు చెందిన బెజ్జంకి రాజేష్ ,కమలాపురానికి చెందిన మాదరి శిరీష (22) అనే యువతి ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నా పెళ్లి విషయంలో ఇరు కుటుంబాల మధ్య విభేదాలు వచ్చాయి. పెళ్లి చేయరనే మనస్తాపంతో ప్రేమజంట అటవీ ప్రాంతం లోకి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందగా.. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

026049
Total views : 149794

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.